Israel-Hamas War: టెల్ అవీవ్ టార్గెట్గా ఇజ్రాయిల్పై హమాస్ భారీ క్షిపణి దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై భారీగా మిస్సైల్ దాడికి పాల్పడ్డారు. హమాస్ సాయుధ విభాగం అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ ఆదివారం ఇజ్రాయిల్ వాణిజ్య రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా క్షిపణి దాడి ప్రారంభించింది. ఇజ్రాయిల్ సైన్యం సెంట్రల్ సిటీలోని సైరన్లను మోగించింది, రాకెట్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారం తన టెలిగ్రామ్ ఛానెల్లో అల్ ఖస్సామ్ బ్రిగేడ్స్ ఒక ప్రకటనలో.. ‘‘పౌరులపై జియోనిస్ట్(ఇజ్రాయిల్) చేస్తున్న మారణకాండకు ప్రతిస్పందగా రాకెట్లను ప్రయోగించాము’’ అని చెప్పారు.
Read Also: Cyclone Remal: తీవ్ర తుఫానుగా మారిన ‘రెమల్’.. బంగ్లాదేశ్, బెంగాల్ తీరాన్ని తాకనున్న తుఫాన్
Also Read
- US Airstrike: తారాస్థాయికి చేరిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. రంగంలోకి బీ-1 బాంబర్!
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లు ప్రయోగించినట్లు హమాస్ అల్ అక్సా టీవీ తెలిపింది. గత నాలుగు నెలలుగా టెల్ అవీవ్లో రాకెట్ సైరన్లు వినిపించలేదు, అయితే సైరన్లకు గల కారణాన్ని ఇజ్రాయిల్ సైన్యం వెంటనే వెల్లడించలేదు. ఇజ్రాయెల్ అత్యవసర వైద్య సేవలు, తమకు ఎలాంటి ప్రాణనష్టం గురించి నివేదికలు అందలేదని చెప్పింది. దక్షిణ గాజాలోని రఫా ప్రాంతం నుంచి హమాస్ కనీసం ఎనిమిది రాకెట్లను ప్రయోగించగా, అనేక రాకెట్లను ఇజ్రాయిల్ సైన్యం అడ్డగించిందని బీబీసీ తెలిపింది. హెర్జ్లియా, పెటా టిక్వాతో సహా వివిధ నగరాల్లో, పట్టణాల్లో సైరన్లు మోగినట్లు నివేదికలు వెల్లడించాయి.
గతేడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై దాడి చేసి 1200 మందిని హతమార్చడమే కాకుండా 240 మంది బందీలుగా గాజాలోకి తీసుకెళ్లి యుద్ధానికి ఆజ్యం పోశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ హమాస్ మిలిటెంట్లు, వారి స్థావరాలే లక్ష్యంగా భీకరదాడులు చేస్తోంది. ఇప్పటికే గాజా నగరం సర్వనాశనం అయింది. మరోవైపు ఈజిప్టు-గాజా సరిహద్దుల్లోని రఫాను స్వాధీనం చేసుకునే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఈ ప్రాంతంలోని హమాస్ మిలిటెంట్లను నిర్మూలించడమే లక్ష్యంగా పేర్కొంది. ఈ యుద్ధం వల్ల అమాయకమైన పాలస్తీనా పౌరులు 36,000 మంది మరణించారు.
తాజావార్తలు
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!