Nigeria: నైజీరియాలో దారుణం.. మసీదులో కాల్పులు.. 12 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gunmen kill 12, including imam, abduct others from mosque in Nigeria: ఆఫ్రికా దేశం నైజీరియాలో ముష్కరులు ఘాతుకానికి పాల్పడ్డారు. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఈ ఘటనలో ఇమామ్ తో సహా 12 మంది మరణించారు. మరికొంత మంది కిడ్నాప్ చేశారు. ఈ ఘటన నైజీరియా కట్సనా రాష్ట్రంలో జరిగింది. ఇది ప్రెసిడెంట్ మహ్మద్ బుహరీ సొంత రాష్ట్రం. సాధారణంగా బందిపోట్లు ఈ ప్రాంతంలో తరుచుగా ప్రజలపై దాడులు చేస్తుంటారు. ప్రజలను చంపడం, లేదా వారిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేయడం చేస్తుంటారు. ఈ ముఠాలు వ్యవసాయం చేయడానికి, పంటలు పండించడానికి గ్రామస్తుల నుంచి డబ్బును డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Gujarat: ముస్లిం మహిళలు ఎన్నికల్లో పోటీ చేయడం ఇస్లాంకు వ్యతిరేకం.. మతాన్ని బలహీన పరచాలనే ఇలా..
Also Read
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా 'రెంట్ ఫ్రీ' సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
మోటార్ సైకిల్ పై వచ్చిన ముష్కరులు, రాత్రి వేళ ప్రార్థనలు జరుగుతున్న సమయంలో కాల్పులు ప్రారంభించారని స్థానికులు వెల్లడించారు. మరికొంత మందిని బలవంతంగా పట్టుకెళ్లారని పేర్కొన్నారు. నైజీరియ వాయువ్య ప్రాంతంలోని కట్సినా రాష్ట్రం, నైజర్ దేశంతో సరిహద్దు పంచుకుంటుంది. బందిపోటు ముఠాలు ఈ రెండు దేశాల సరిహద్దు వెంబడి స్వేచ్ఛగా తిరుగుతుంటారు. నైజీరియా సైన్యం బందిపోట్లు ఉపయోగించే బుష్ శిబిరాలపై దాడులు చేస్తోంది. వచ్చే ఫిబ్రవరీలో ఎన్నికలు జరిగే క్రమంలో ఈ దాడి జరగడం అక్కడి ప్రజల్లో భయాలను పెంచుతోంది.
ఈ ఘటనలో మొత్తం 19 మందిని కిడ్నాప్ చేసింది బందిపోటు ముఠా. పశువులను దొంగిలించడానికి గ్రామాలపై దాడి చేయడం, కిడ్నాప్ చేయడం, దోపిడీ చేయడం, ఇళ్లను తగలబెట్టడం, వ్యవసాయానికి బదులుగా డబ్బును దోపిడీ చేయడం ద్వారా అక్కడి ప్రజలపై దాడులు చేస్తున్నాయి ఈ ముఠాలు. రుగు అటవీ ప్రాంతం బందిపోట్లకు స్వర్గధామంగా ఉంది. గత నెలలో బందిపోట్లు 15 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఖలీఫా రాజ్యాన్ని స్థాపించేందుకు గత 10 ఏళ్ల నుంచి బందిపోట్లు ప్రభుత్వంతో యుద్ధం చేస్తున్నారు. అయితే అధ్యక్షుడు బుహారీ మాత్రం తన పదవీ కాలం పూర్తయ్యేలోగా హింసను అంతం చేస్తానని సవాల్ చేశాడు. దీంతో నైజీరియా సైన్యం బందిపోట్ల ఆవాసాలపై విరుచుకుపడుతున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!