HIV: హెచ్ఐవీని జయించిన ప్రపంచంలో ఏడో వ్యక్తి..
- ప్రపంచంలో హెచ్ఐవీని జయించిన ఏడో వ్యక్తి..
- హెచ్ఐవీ.. లుకేమియాలకు స్టెమ్ సెల్ మార్పిడి..
- ఆరేళ్ల తర్వాత హెచ్ఐవీ కనిపించడం లేదన్న పరిశోధకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HIV: హెచ్ఐవీ-ఎయిడ్స్ ఇప్పటికీ వైద్య రంగానికి కొరకురాని కొయ్యగా మిగిలింది. ప్రపంచంలో అధునాతన చికిత్స విధానాలు అందుబాటులోకి వస్తున్నప్పటకీ హెచ్ఐవీని పూర్తిగా నయం చేసే చికిత్స కానీ మందులు కానీ శాస్త్రవేత్తలు కనుగొనలేకపోతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అనూహ్యం హెచ్ఐవీ రోగులు ఈ వ్యాధిని జయించిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా జర్మనీకి చెందిన మరో వ్యక్తి కూడా హెచ్ఐవీని జయించిన్నట్లు తెలుస్తోంది. ఇలా దీని నుంచి పూర్తిగా కోలుకున్న ప్రపంచంలో ఏడో వ్యక్తిగా రికార్డులకెక్కనున్నారు.
హెచ్ఐవీతో పాటు లుకేమియా క్యాన్సర్తో బాధపడుతున్న బెర్లిన్కి చెందిన 60 ఏళ్ల వ్యక్తిని గోప్యత కారణంగా ‘‘నెక్ట్స్ బెర్లిన్ పేషెంట్’’గా వ్యవహరిస్తున్నారు. స్టెమ్ సెల్ మార్పిడి (ఎముక మజ్జ మార్పిడి) ద్వారా ఈ రెండు వ్యాధులు నయమయ్యే అవకాశం ఉంది. అయితే, ఇది ఒక ప్రత్యేక కేసుగా మాత్రమే వైద్యులు పేర్కొంటున్నారు, ప్రపంచంలోని 40 మిలియన్ల హెచ్ఐవీ రోగులకు ఈ చికిత్స ఒక ఎంపిక కాదని చెబుతున్నారు.
Also Read
- Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
- Khawaja Asif: పశ్చిమాసియాలో యుద్ధం మళ్లీ మొదలవ్వడంపై పాక్ రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Iran: ట్రంప్, నెతన్యాహుల తలలు తీస్తే రూ.450 కోట్ల బహుమతి.. ఖమేనీ మృతికి ఇరాన్ రివెంజ్ ప్లాన్!
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
Read Also: CM Chandrababu: ఇంకా దొరకని ఎంపీడీవో వెంకట రమణ ఆచూకీ.. కుటుంబ సభ్యులకు సీఎం ఫోన్
మొదటగా అసలు బెర్లిన్ పెషెంట్గా పేర్కొనబడిన తిమోతీ రే బ్రౌన్ 2008లో తొలిసారి హెచ్ఐవీ నుంచి నయమైన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. బ్రౌన్ 2020లో క్యాన్సర్తో మరణించాడు. వచ్చే వారంలో బెర్లిన్ వేదికగా 25వ అంతర్జాతీయ ఎయిడ్స్ కాన్ఫరెన్స్ జరగబోతోంది. దీనికి ముందు బెర్లిన్కి చెందిన మరో రోగి దీర్ఘకాలిక హెచ్ఐవీ నుంచి ఉపశమనం లభించే రెండో వ్యక్తిగా, ప్రపంచంలో ఏడు వ్యక్తిగా గుర్తించబడనున్నారు.
ప్రస్తుతం పేర్కొనబడుతున్న రోగి 2009లో హెచ్ఐవీ బారిన పడ్డాడు. ఇతనికి 2015లో లుకేమియా సోకింది. ఈ చికిత్స కోసం ఎముక మజ్జ మార్పిడి అనే అత్యంత క్లిష్టమైన చికిత్స విధానాన్ని అవలంభిస్తారు. ఈ ప్రక్రియలో 10 శాతం మరణ ప్రమాదం ఉంది. ఎముక మజ్జ ద్వారా వ్యక్తి రోగనిరోధక శక్తి భర్తీ చేయబడుతుంది. దీని తర్వాత 2018 చివరి నుంచి హెచ్ఐవీ చికిత్సలో వాడే ‘‘యాంటీ రెట్రో వైరల్’’ డ్రగ్స్ తీసుకోవడం మానేశారు. దాదాపుగా ఆరు ఏళ్ల తర్వాత ఇతను హెచ్ఐవీ, క్యాన్సర్ నుంచి బయటపడినట్లు కనిపిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.
తాజావార్తలు
-
Mumbai Indians: ముంబై ఇండియన్స్కు డబుల్ షాక్.. ఇంటి బాట పట్టిన స్టార్ ప్లేయర్లు..
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
Purusha : భార్యల టార్చర్లు, మగాళ్ల కష్టాలు..క్షేమంగా వెళ్లి లాభంగా రండి వైబ్’లో ‘పురుష:’ ట్రైలర్!
-
Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
-
Entire Village Set On Fire: దారుణ ఘటన.. ప్రేమ పెళ్లి చేసుకున్నారని ఊరినే తగలబెట్టేశారు..
ట్రెండింగ్
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!