Trump Targets India: భారత్ను టార్గెట్ చేసిన అమెరికా.. సుంకాల విధింపులో జీ7 దేశాలను ఒప్పించిన ట్రంప్!
- రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ను టార్గెట్ చేసిన అమెరికా..
- సుంకాల విధింపులో జీ7 దేశాలను ఒప్పించిన డొనాల్డ్ ట్రంప్!
- త్వరలోనే భారత్, చైనాలో ఐరోపా దేశాల సమాఖ్య సుంకాల విధింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump Targets India: ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ ను టార్గెట్ చేయడమే సరైన మార్గమని అగ్రరాజ్యం అమెరికా భావిస్తోంది. అందులో భాగంగానే మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తున్న ఇండియా, చైనాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో ఈయూ, జీ7 దేశాలు భారత్, చైనాలపై భారీగా టారిఫ్లు విధించాలని ట్రంప్ పాలకవర్గం ప్రతిపాదనలను పంపించింది. ఈ సుంకాల విధించడానికి తాజాగా జీ7 దేశాలు కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.
Read Also: Begumpet: శ్మశానంలో వ్యభిచారం.. బేగంపేట పరిధిలో శ్మశాన వాటికను వ్యభిచార గృహంగా మార్చిన మహిళ
Also Read
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
- China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
కాగా, జీ7 దేశాల ఆర్థిక మంత్రులు శుక్రవారం ( సెప్టెంబర్ 12న) నాడు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి మధ్య సుంకాల విధింపుపై చర్చ కొనసాగినట్లు టాక్. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను యూఎస్ వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి నిజంగా కట్టుబడి ఉంటే.. మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు ఈయూ ముందుకు రావాలని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ పిలుపునిచ్చారు. అందుకు ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న రెండు పొరుగు దేశాల (భారత్, చైనా)పై సుంకాలు విధించాలని డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనల గురించి చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పటికే.. భారత దిగుమతులపై యూఎస్ 50 శాతం సుంకాలు విధించింది.
Read Also: Hamas-Israel: ఖతార్లో పని చేయని ఇజ్రాయెల్ ఎత్తుగడ.. సజీవంగా హమాస్ నేతలు.. అసలేమైందంటే..!
అయితే, ఉక్రెయిన్- రష్యా యుద్ధం ముగింపుకి కట్టుబడి ఉన్నామంటూ జీ7 దేశాలు చేసిన ప్రకటనను తాము స్వాగతిస్తున్నట్లు అమెరికా తెలిపింది. దీంతో భారత్, చైనాలపై టారీఫ్స్ విధించేందుకు ఆయా దేశాలు రెడీ అయినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!