Emmanuel Macron: పాలస్తీనా ఏర్పాటుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మద్దతు.. మండిపడ్డ ట్రంప్, నెతన్యాహు
- పాలస్తీనా ఏర్పాటుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మద్దతు
- మండిపడ్డ ట్రంప్, నెతన్యాహు
హమాస్ అంతమే లక్ష్యంగా గత కొన్ని నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. వందలాది మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: PM Modi: మాల్దీవులు చేరుకున్న మోడీ.. స్వయంగా స్వాగతం పలికిన ముయిజ్జు
Also Read
- Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
- Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
- Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
- Condom Prices: బెడ్రూమ్లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
కానీ అందుకు విరుద్ధంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కొత్త రాగం అందుకున్నారు. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని తెలిపారు. సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా లేవనెత్తుతున్నట్లు వెల్లడించారు. గాజాలో యుద్ధాన్ని ముగించి పౌర జనాభాను రక్షించడం నేటి అత్యవసర ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్లో పాలస్తీనా దేశాన్ని గుర్తించడానికి ఫ్రాన్స్ ముందుకు కదులుతుందని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్లో ఘోర విషాదం.. స్కూల్ బిల్డింగ్ కూలి నలుగరు మృతి
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రకటనను హమాస్, ముస్లిం దేశాలు స్వాగతించాయి. సరైన సమయంలో ఇది సానుకూల అడుగుగా అభివర్ణించింది. మాక్రాన్ చేసిన ప్రతిజ్ఞను హమాస్ ప్రశంసించింది. అయితే ఈ ప్రకటనపై ట్రంప్, నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. నిర్లక్ష్యం, సిగ్గుచేటు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి.
ఇది కూడా చదవండి: PM Modi: మోడీ సరికొత్త రికార్డ్! దేశ చరిత్రలో..!
మాక్రాన్ ప్రకటనను అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించాయి. అక్టోబర్ 7 నాటి దాడి బాధితుల ముఖంపై చెంపదెబ్బలాంటిదని అమెరికా దేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అభివర్ణించారు. పాలస్తీనాను గుర్తించడమంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని.. ఇది ఇజ్రాయెల్ అస్తిత్వానికే ముప్పు కలిగిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తెలిపారు.
ప్రస్తుతం గాజాలో ఆకలి కేకలు ఎక్కువైపోయాయి. చాలా నెలలుగా యుద్ధం జరగడంతో ఆహారం సరఫరా నిలిచిపోయింది. దీంతో గాజా ప్రజలు ఆకలితో తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. కొంత మంది ప్రాణాలు పోతున్నాయి. చిన్నారులు, వృద్ధులు ఆకలితో ప్రాణాలు వదులుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాక్రాన్.. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేసి ప్రజల్ని రక్షించాల్సిందేనని పేర్కొ్న్నారు. ఈ వ్యవహారం ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Gujarat: సూరత్లో ప్రముఖ పారిశ్రామికవేత్త కోడలు ఆత్మహత్య.. 2 నెలల క్రితమే పెళ్లి
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
MI vs CSK: రోహిత్, ధోనీ ఆడతారా?.. ముంబై-చెన్నై మ్యాచ్కు ముందు కీలక అప్డేట్!
-
Divyanka Sirohi : గుండెపోటుతో హీరోయిన్ మృతి..
-
TVK Vijay: “ఇది ప్రణాళికాబద్ధమైన కుట్ర”.. ఎన్నికల సంఘానికి టీవీకి అధినేత విజయ్ లేఖ..
ట్రెండింగ్
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?