Emmanuel Macron: పాలస్తీనా ఏర్పాటుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మద్దతు.. మండిపడ్డ ట్రంప్, నెతన్యాహు
- పాలస్తీనా ఏర్పాటుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మద్దతు
- మండిపడ్డ ట్రంప్, నెతన్యాహు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్ అంతమే లక్ష్యంగా గత కొన్ని నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. వందలాది మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
ఇది కూడా చదవండి: PM Modi: మాల్దీవులు చేరుకున్న మోడీ.. స్వయంగా స్వాగతం పలికిన ముయిజ్జు
Also Read
- Melania Trump: అమెరికా అధ్యక్షుడి భార్య ఎక్కడ? నెల రోజులుగా కనిపించని మెలానియా ట్రంప్!
- Economic D-Day: ఇరాన్కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
- Turkey-Israel tensions: టర్కీ-ఇజ్రాయిల్ మధ్య యుద్ధ మేఘాలు.. సిరియా వేదికగా కొత్త ముప్పు!
- Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
కానీ అందుకు విరుద్ధంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కొత్త రాగం అందుకున్నారు. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని తెలిపారు. సెప్టెంబర్లో జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా లేవనెత్తుతున్నట్లు వెల్లడించారు. గాజాలో యుద్ధాన్ని ముగించి పౌర జనాభాను రక్షించడం నేటి అత్యవసర ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే సెప్టెంబర్లో పాలస్తీనా దేశాన్ని గుర్తించడానికి ఫ్రాన్స్ ముందుకు కదులుతుందని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్లో ఘోర విషాదం.. స్కూల్ బిల్డింగ్ కూలి నలుగరు మృతి
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రకటనను హమాస్, ముస్లిం దేశాలు స్వాగతించాయి. సరైన సమయంలో ఇది సానుకూల అడుగుగా అభివర్ణించింది. మాక్రాన్ చేసిన ప్రతిజ్ఞను హమాస్ ప్రశంసించింది. అయితే ఈ ప్రకటనపై ట్రంప్, నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. నిర్లక్ష్యం, సిగ్గుచేటు అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి.
ఇది కూడా చదవండి: PM Modi: మోడీ సరికొత్త రికార్డ్! దేశ చరిత్రలో..!
మాక్రాన్ ప్రకటనను అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించాయి. అక్టోబర్ 7 నాటి దాడి బాధితుల ముఖంపై చెంపదెబ్బలాంటిదని అమెరికా దేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అభివర్ణించారు. పాలస్తీనాను గుర్తించడమంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమేనని.. ఇది ఇజ్రాయెల్ అస్తిత్వానికే ముప్పు కలిగిస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తెలిపారు.
ప్రస్తుతం గాజాలో ఆకలి కేకలు ఎక్కువైపోయాయి. చాలా నెలలుగా యుద్ధం జరగడంతో ఆహారం సరఫరా నిలిచిపోయింది. దీంతో గాజా ప్రజలు ఆకలితో తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. కొంత మంది ప్రాణాలు పోతున్నాయి. చిన్నారులు, వృద్ధులు ఆకలితో ప్రాణాలు వదులుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాక్రాన్.. పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేసి ప్రజల్ని రక్షించాల్సిందేనని పేర్కొ్న్నారు. ఈ వ్యవహారం ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!