Nepal Elections: నేపాల్ ఎన్నికల్లో బాలెన్ షా చేతిలో “భారత వ్యతిరేకి” ఘోర ఓటమి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal Elections: ‘‘జెన్ Z’’ ఉద్యమం తర్వాత నేపాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(RSP) ప్రధానమంత్రి అభ్యర్థి బాలెన్ షా ఘన విజయం సాధించారు. నేపాల్ కాబోయే ప్రధానిగా బాలెన్ షా ఉన్నారు. నేపాల్ యువతలో క్రేజ్ కలిగిన ఈ మాజీ రాపర్, సింగర్ ఇప్పుడు నేపాల్ దశాదిశను నిర్ణయించబోతున్నారు. ఝాపా జిల్లాలోని 5వ నియోజకవర్గం నుంచి బాలెన్ షా విజయం సాధించారు. నేపాల్ మాజీ ప్రధాని, జెన్ జీ యువత ఉద్యమం తర్వాత నేపాల్ ప్రధానిగా రాజీనామా చేసిన కేపీ శర్మ ఓలికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయారు. ఏకంగా 50,000 ఓట్ల తేడాతో ఓలిపై బాలెన్ షా గెలిచారు.
Also Read
- Military Tension: ఖేష్మ్, బందర్ అబ్బాస్పై అమెరికా దాడులు.. హార్ముజ్ ఉద్రిక్తతలు మరింత తీవ్రం
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
తుది ఓట్ల ఫలితాల ప్రకారం, బాలెన్ షా మొత్తం 68,348 ఓట్లు సాధించగా, కె.పి. శర్మ ఓలి ఈ నియోజకవర్గంలో దాదాపు 18,000 ఓట్లు సాధించారు. అందువల్ల, ఇద్దరు అభ్యర్థుల మధ్య దాదాపు 50,000 ఓట్ల తేడా ఉంది. ఓలి భారత్ వ్యతిరేకిగా పేరుంది. తన పాలనలో చైనాకు అనుకూలంగా వ్యవహరించారు. భారత్తో సంబంధాలు దెబ్బతినేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు అయోధ్యలో పుట్టలేదని కామెంట్స్ చేశారు. ఇక భారత్లో అంతర్భాగంగా ఉన్న లింపియాధురా, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలు తమవే అని చెప్పుకున్నారు.
275 మంది సభ్యులున్న పార్లమెంటులో ప్రత్యక్షంగా ఎన్నికైన 165 స్థానాల్లో RSP 117 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో బాలెన్ షా ప్రధాని కావడం ఖాయంగా కనిపిస్తోంది. నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలను నేపాల్ ప్రజలు అస్సలు పట్టించుకోలేదు. ఆర్ఎస్పీ తర్వాత రెండో స్థానంలో నేపాల్ కాంగ్రెస్ 15 సీట్లతో ఉంది. ఓలీ పార్టీ 10 లోపు స్థానాలకే పరిమితమై ఘోర ఓటమి దిశగా వెళ్తోంది. నేపాల్ ప్రజాస్వామ్య చరిత్రలో 36 ఏళ్ల లో మొదటిసారిగా ఒక పార్టీకి నేపాల్ ప్రజలు పూర్తిస్థాయి మెజారిటీ కట్టబెట్టారు.
తాజావార్తలు
-
BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!
-
AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు
-
Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
-
Laila: జ్యోతికకు తెలిస్తే చంపేస్తుంది.. సూర్య పై ఓపెన్ కామెంట్స్ చేసిన లైలా
-
IPL Playoffs: ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో.. వరుసగా ఐదు మ్యాచ్లలో ఐదు అర్ధ సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు అతనే..