Covid 19: మొదటి కరోనా కేసుకి 5 ఏళ్లు.. చైనా ఏం చెబుతోందంటే..?
- కోవిడ్-19 తొలి కేసుకు 5 ఏళ్లు..
- చైనా వూహాన్ నగరంలో గుర్తింపు..
- తమ వద్ద సమాచాారాన్ని డబ్ల్యూహెచ్ఓకి షేర్ చేశామన్న డ్రాగన్ కంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid 19: ఇప్పుడున్న జనరేషన్ కోవిడ్-19 వంటి మహమ్మారిని ఎదుర్కొంది. మానవ చరిత్ర కలరా, ప్లేగు, స్పానిష్ ఫ్లూ వంటి ఎన్నో మహమ్మారులను ఎదుర్కొంది. అయితే, వైద్యం అభివృద్ధి చెందడంతో చాలా ఏళ్లుగా మహమ్మారి అనే పేరు వినిపించలేదు. అయితే, 2019లో చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్, కోవిడ్-19 మహమ్మారికి కారణమైంది. తొలి కరోనా కేసులు వెలుగులోకి వచ్చి నేటికి 5 ఏళ్లు గడిచాయి. డిసెంబర్ 31, 2019 తొలి కోవిడ్ కేసు నమోదైంది. ముందుగా దీనిని ‘‘ వైరల్ న్యూమోనియా’’ అని పిలిచారు. ఆ తర్వాత కరోనా వైరస్ ద్వారా వచ్చే కోవిడ్-19 అని గుర్తించారు. భారతదేశంలో తొలి కేసు జనవరి 30, 2020లో కేరళలో నమోదైంది. త్రిసూర్కి చెందిన నివాసి వూహాన్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నాడు.
Read Also: Manipur Violence: “క్షమించండి”.. మణిపూర్ హింసపై సీఎం బిరెన్ సింగ్
Also Read
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల్లో కూడా కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇటలీ, అమెరికా, భారత్, చైనా ఇలా ప్రముఖ దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మానవ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దేశాలకు దేశాలు తమ సరిహద్దుల్ని మూసేశాయి. ప్రజలు ‘‘లాక్డౌన్’’ వల్ల ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రపంచం దీనిని అడ్డుకునేందుకు వ్యాక్సిన్ల త్వరితగతిన తీసుకువచ్చాయి. అయినప్పటికీ ఇప్పటికీ పలు దేశాల్లో కరోనా కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
అయితే, కోవిడ్-19కి సంబంధించి మరింత సమాచారం పంచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) పిలుపునిచ్చింది. దీనికి ప్రతిస్పందగా తమ వద్ద ఉన్న కోవిడ్-19 డేటా, పరిశోధన ఫలితాలన్నింటిని పంచుకున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో ట్రేసబిలిటీ పురోగతిని పంచుకోవడానికి నిపుణులను ఏర్పాటు చేసిన ఏకైక దేశం చైనానే అని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మావోనింగ్ చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 76 కోట్లకు పైగా కోవిడ్-19 కేసులు, 6.9 మిలియన్ మరణాలు నమోదయ్యాయని తెలిపింది.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!