Covid 19: మొదటి కరోనా కేసుకి 5 ఏళ్లు.. చైనా ఏం చెబుతోందంటే..?
- కోవిడ్-19 తొలి కేసుకు 5 ఏళ్లు..
- చైనా వూహాన్ నగరంలో గుర్తింపు..
- తమ వద్ద సమాచాారాన్ని డబ్ల్యూహెచ్ఓకి షేర్ చేశామన్న డ్రాగన్ కంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid 19: ఇప్పుడున్న జనరేషన్ కోవిడ్-19 వంటి మహమ్మారిని ఎదుర్కొంది. మానవ చరిత్ర కలరా, ప్లేగు, స్పానిష్ ఫ్లూ వంటి ఎన్నో మహమ్మారులను ఎదుర్కొంది. అయితే, వైద్యం అభివృద్ధి చెందడంతో చాలా ఏళ్లుగా మహమ్మారి అనే పేరు వినిపించలేదు. అయితే, 2019లో చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్, కోవిడ్-19 మహమ్మారికి కారణమైంది. తొలి కరోనా కేసులు వెలుగులోకి వచ్చి నేటికి 5 ఏళ్లు గడిచాయి. డిసెంబర్ 31, 2019 తొలి కోవిడ్ కేసు నమోదైంది. ముందుగా దీనిని ‘‘ వైరల్ న్యూమోనియా’’ అని పిలిచారు. ఆ తర్వాత కరోనా వైరస్ ద్వారా వచ్చే కోవిడ్-19 అని గుర్తించారు. భారతదేశంలో తొలి కేసు జనవరి 30, 2020లో కేరళలో నమోదైంది. త్రిసూర్కి చెందిన నివాసి వూహాన్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నాడు.
Read Also: Manipur Violence: “క్షమించండి”.. మణిపూర్ హింసపై సీఎం బిరెన్ సింగ్
Also Read
ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల్లో కూడా కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇటలీ, అమెరికా, భారత్, చైనా ఇలా ప్రముఖ దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మానవ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దేశాలకు దేశాలు తమ సరిహద్దుల్ని మూసేశాయి. ప్రజలు ‘‘లాక్డౌన్’’ వల్ల ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రపంచం దీనిని అడ్డుకునేందుకు వ్యాక్సిన్ల త్వరితగతిన తీసుకువచ్చాయి. అయినప్పటికీ ఇప్పటికీ పలు దేశాల్లో కరోనా కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
అయితే, కోవిడ్-19కి సంబంధించి మరింత సమాచారం పంచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) పిలుపునిచ్చింది. దీనికి ప్రతిస్పందగా తమ వద్ద ఉన్న కోవిడ్-19 డేటా, పరిశోధన ఫలితాలన్నింటిని పంచుకున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో ట్రేసబిలిటీ పురోగతిని పంచుకోవడానికి నిపుణులను ఏర్పాటు చేసిన ఏకైక దేశం చైనానే అని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మావోనింగ్ చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 76 కోట్లకు పైగా కోవిడ్-19 కేసులు, 6.9 మిలియన్ మరణాలు నమోదయ్యాయని తెలిపింది.
తాజావార్తలు
-
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!