Covid 19: మొదటి కరోనా కేసుకి 5 ఏళ్లు.. చైనా ఏం చెబుతోందంటే..?
- కోవిడ్-19 తొలి కేసుకు 5 ఏళ్లు..
- చైనా వూహాన్ నగరంలో గుర్తింపు..
- తమ వద్ద సమాచాారాన్ని డబ్ల్యూహెచ్ఓకి షేర్ చేశామన్న డ్రాగన్ కంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Covid 19: ఇప్పుడున్న జనరేషన్ కోవిడ్-19 వంటి మహమ్మారిని ఎదుర్కొంది. మానవ చరిత్ర కలరా, ప్లేగు, స్పానిష్ ఫ్లూ వంటి ఎన్నో మహమ్మారులను ఎదుర్కొంది. అయితే, వైద్యం అభివృద్ధి చెందడంతో చాలా ఏళ్లుగా మహమ్మారి అనే పేరు వినిపించలేదు. అయితే, 2019లో చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్, కోవిడ్-19 మహమ్మారికి కారణమైంది. తొలి కరోనా కేసులు వెలుగులోకి వచ్చి నేటికి 5 ఏళ్లు గడిచాయి. డిసెంబర్ 31, 2019 తొలి కోవిడ్ కేసు నమోదైంది. ముందుగా దీనిని ‘‘ వైరల్ న్యూమోనియా’’ అని పిలిచారు. ఆ తర్వాత కరోనా వైరస్ ద్వారా వచ్చే కోవిడ్-19 అని గుర్తించారు. భారతదేశంలో తొలి కేసు జనవరి 30, 2020లో కేరళలో నమోదైంది. త్రిసూర్కి చెందిన నివాసి వూహాన్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతున్నాడు.
Read Also: Manipur Violence: “క్షమించండి”.. మణిపూర్ హింసపై సీఎం బిరెన్ సింగ్
Also Read
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Iran: "నరకం చూపిస్తాం".. అమెరికా, గల్ఫ్ దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- Donald Trump: "ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు".. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
- Japan Earthquake: జపాన్లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా అన్ని దేశాల్లో కూడా కోవిడ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇటలీ, అమెరికా, భారత్, చైనా ఇలా ప్రముఖ దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మానవ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా దేశాలకు దేశాలు తమ సరిహద్దుల్ని మూసేశాయి. ప్రజలు ‘‘లాక్డౌన్’’ వల్ల ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రపంచం దీనిని అడ్డుకునేందుకు వ్యాక్సిన్ల త్వరితగతిన తీసుకువచ్చాయి. అయినప్పటికీ ఇప్పటికీ పలు దేశాల్లో కరోనా కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
అయితే, కోవిడ్-19కి సంబంధించి మరింత సమాచారం పంచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) పిలుపునిచ్చింది. దీనికి ప్రతిస్పందగా తమ వద్ద ఉన్న కోవిడ్-19 డేటా, పరిశోధన ఫలితాలన్నింటిని పంచుకున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థతో ట్రేసబిలిటీ పురోగతిని పంచుకోవడానికి నిపుణులను ఏర్పాటు చేసిన ఏకైక దేశం చైనానే అని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి మావోనింగ్ చెప్పారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 76 కోట్లకు పైగా కోవిడ్-19 కేసులు, 6.9 మిలియన్ మరణాలు నమోదయ్యాయని తెలిపింది.
తాజావార్తలు
-
Animation Universe: టాలీవుడ్లో కొత్త ట్రెండ్.. ‘ఆర్య’ కోసం యానిమేటెడ్ యూనివర్స్ సిద్ధం!
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!