Afghanistan: దయనీయ పరిస్థితిలో అఫ్గానిస్థాన్.. భారత్ నుంచి మానవతాసాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూకంపంలో తీవ్రంగా దెబ్బతిన్న అఫ్గానిస్థాన్లో దయనీయ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి మానవతాసాయం అందింది. గురువారం రాత్రి భారత్ నుంచి విమానంలో అవసరమైన పరికరాలు, సామగ్రిని అఫ్గాన్ రాజధాని కాబూల్కు తరలించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. సామగ్రితో వారికి సాయం అందించేందుకు సాంకేతిక బృందం కూడా వెళ్లినట్లు తెలిపింది. ఈ నేపథ్యం భూకంపంతో తీవ్రంగా దెబ్బతిన్న అఫ్గాన్ను ఆదుకున్న తొలిదేశంగా భారత్ నిలిచింది. భారత్ నుంచి వెళ్లిన బృందం తాలిబన్లతో కలిసి సాయం పంపిణీని పర్యవేక్షించనున్నట్లు తెలుస్తోంది. సాంకేతిక బృందం భద్రత గురించి తాలిబన్ల నుంచి పలుమార్లు హామీ వచ్చాకే అక్కడికి మనదేశానికి చెందిన బృందం పయనమైంది.
ఇప్పటికే ఉగ్రదాడులు, తాలిబన్ల దాడులతో కుదేలైన అఫ్గాన్కు భూకంపంలో మరో ఆపద వచ్చిపడింది. భూకంపంలో భారీ ఎత్తున ఇళ్లు ధ్వంసం కాగా.. చాలా మంది చనిపోయారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. వారికి తగిన వైద్య సదుపాయాలు అందే పరిస్థితి కూడా అక్కడ లేదు. ఈ దుర్భర పరిస్థితుల నేపథ్యంలో భారత్ అఫ్గాన్కు సాయం అందించేందుకు ముందుకొచ్చింది. భారత్ సాయానికి అఫ్గాన్లోని తాలిబన్ సర్కారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- US Passport Ranking: అగ్రరాజ్యానికి ఊహించని దెబ్బ.. యూఎస్ పాస్పోర్ట్ పవర్ తగ్గిందా? భారత్ ర్యాంక్ చూస్తే ఆశ్చర్యపోతారు!
- Pakistan: పక్క దేశంలో అసలేం జరుగుతోంది? పాకిస్థాన్లో పాలకులకు ఆర్మీతో పడట్లేదా?
- Trump Immigration: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి ఇప్పటి వరకు ఎంత మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారంటే!
- PM Modi: యూకే కొత్త ప్రధానికి మోడీ ఫోన్.. ఏం మాట్లాడారంటే!
ఇటీవల భారత పొరుగు దేశమైన అఫ్గానిస్థాన్లో భారీ భూకంప సంభించిన విషయం తెలసిందే. ఈ భూకంప ధాటికి వెయ్యిమందికి పైగా మృతి చెందారు. అంతేకాకుండా సుమారు పదిహేను వందల మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద చాలా మంది సజీవ సమాధి అయ్యారు. అయితే.. ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో.. సహాయక చర్యలు కూడా ముందుకు సాగలేకపోతున్నాయని అక్కడి అధికారులు అంటున్నారు. భూకంపం ఎఫెక్ట్కు ఖోస్ట్ ప్రావిన్స్ స్పెరా జిల్లాలో ఎక్కువ భాగం దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. గియాన్ జిల్లాలో ఘోరమైన ప్రాణ నష్టం వాటిల్లింది.
తాజావార్తలు
-
TSLPRB Recruitment 2026: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
-
Anti-Reservation stir: రిజర్వేషన్ హటావో ఉద్యమం ఎందుకు ఊపందుకుంది? దేశాన్ని కుదిపేస్తున్న కొత్త రచ్చ!
-
Lenin OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న100 కోట్ల బ్లాక్బస్టర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘లెనిన్’
-
Tesla Model Y: టెస్లా మోడల్ Y ఇప్పుడు గ్రోక్ AI ఫీచర్తో.. హిందీ, తెలుగు సహా పలు భాషల్లో మాట్లాడే AI అసిస్టెంట్
-
Nara Lokesh: భోగాపురం ఎయిర్పోర్ట్ ఏపీకి పవర్ ఇంజిన్.. ‘ఎర్రబస్సు రాదన్న చోట ఎయిర్పోర్టు వచ్చింది’
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!