కరోనా హమ్మారిపై విజయం సాధించడానికి రకరకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. కొన్ని దేశాలు స్వయంగా వ్యాక్సిన్లు తయారు చేస్తే.. మరికొన్ని దేశాలు వాటిని దిగుమతి చేసుకుని తమ ప్రజలకు అందిస్తున్నాయి.. అయితే, అక్కడక్కడ వ్యాక్సిన్లు వికటించిన మృతిచెందినట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి.. తాజాగా, న్యూజిలాండ్లో ఓ మహిళ మృతిచెందారు.. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ మహిళ చనిపోయినట్లు న్యూజిలాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అత్యంత అరుదైన మయోకార్డిటిస్ అంటే గుండె కండరాల్లో ఇన్ఫ్లేమేషన్తో ఆ మహిళ చనిపోయినట్టు భావిస్తున్నామని.. ఫైజర్ వ్యాక్సిన్ వల్ల దేశంలో సంభవించిన తొలి మరణం ఇదేనని ప్రకటించింది న్యూజిలాండ్. ఇక, ఆ మహిళ ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని కూడా తెలిపింది. మరోవైపు.. ఫైజర్ వ్యాక్సిన్ వల్ల కలిగే అనర్థాల కంటే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని కూడా వెల్లడించింది.