America: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం భారత సంతతి, న్యాయవాది హర్మీత్ కె.ధిల్లాన్ను న్యాయ శాఖలో పౌర హక్కుల విభాగంలో అసిస్టెంట్ అటార్నీ జనరల్గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ధిల్లాన్ నియామకంపై ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా రియాక్ట్ అయ్యారు. హర్మీత్ కె.ధిల్లాన్ దేశంలోని ప్రముఖ న్యాయ వాదులలో ఒకరు అని చెప్పుకొచ్చారు. మన రాజ్యాంగ హక్కుల కోసం ఆమె అవిశ్రాంతంగా పోరాడుతున్నారు.. కాబట్టి, ధిల్లాన్కు అప్పగించిన పౌర హక్కులు, ఎన్నికల చట్టాలను సక్రమంగా అమలు చేస్తారని ఆశిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
Read Also: Mumbai: జనాలపైకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి, 29 మందికి గాయాలు
అయితే, ట్రంప్ అప్పగించిన బాధ్యతలను అత్యంత గౌరవంగా భావిస్తున్నాను అని హర్మీత్ కె.ధిల్లాన్ తెలిపారు. మన దేశానికి సేవ చేయడం నా యొక్క కల.. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అద్భుతమైన న్యాయవాదుల బృందంలో భాగం అయినందుకు ఎంతగానో సంతోషిస్తున్నానని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చింది. కాగా, ఇప్పటికే ట్రంప్ తన పాలక వర్గంలో భారత సంతతికి చెందిన వారికి కీలక పదవులను అప్పగించారు.. అందులో వివేక్ రామస్వామి (డోజ్), డాక్టర్ జే భట్టాచార్య (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్), కశ్యప్ పటేల్ (ఎఫ్బీఐ డైరెక్టర్)లను ఇప్పటికే నియమించగా.. తాజాగా హర్మీత్ కె.ధిల్లాన్ను సైతం పౌర హక్కుల విభాగంలో అసిస్టెంట్ అటార్నీగా నియమించారు.