SpiceJet: స్పైస్జెట్పై కేంద్రం సీరియస్.. 8 వారాల పాటు ఆంక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGCA Ordered SpiceJet To Operate 50 Percent Flights For 8 Weeks: స్పైస్జెట్ ఎయిర్లైన్స్పై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈమధ్య వరుసగా ప్రమాదాలు సంభించిన నేపథ్యంలో.. డీజీసీఏ ఆ సంస్థపై ఆంక్షలు విధించింది. 8 వారాల పాటు 50 శాతం మాత్రమే విమాన సర్వీసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందే.. 18 రోజుల వ్యవధిలో 8 సార్లు సాంకేతిక లోపాలు తలెత్తడంతో.. వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా డీజీసీఏ ఆ సంస్థకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే!
కాగా.. గత నెల 19 నుంచి స్పైస్జెట్ విమానాల్లో ఏకంగా 8సార్లు సాంకేతిక లోపాలు తలెత్తాయి. జూన్ 19వ తేదీన 185 ప్రయాణికులతో పాట్నా నుంచి బయలుదేరిన ఓ విమానాన్ని పక్షి ఢీకొనడంతో, అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అదే రోజు.. జబల్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో ఓ సమస్య తలెత్తింది. అనంతం జూన్ 24, 25 తేదీల్లో రెండు వేర్వేరు విమానాల్లో ఫ్యూజ్లేజ్ డోర్ వార్నింగ్ తలెత్తడంతో.. ఆ రెండు విమాన సర్వీసుల్ని క్యాన్సిల్ చేశారు. ఆ మరుసటి రోజే చెన్నై నుంచి కోల్కతా బయలుదేరిన స్పైస్జెట్ కార్గో విమానం వెదర్ రాడార్ పని చేయకపోవడంతో.. అది వెనక్కు వచ్చేసింది. ఈ నెల 2వ తేదీన ఢిల్లీ నుంచి జబల్పూర్కు బయలుదేరిన ఫ్లైట్లో టేకాఫ్ సమయంలోనే క్యాబిన్లో పొగలు వచ్చాయి.
Also Read
- Russia-Ukraine War: నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంపై.. రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన
- UFO Files: ఏలియన్ల గుట్టు రట్టు.. చరిత్రలో తొలిసారిగా 'UFO' రహస్య పత్రాలను బయటపెట్టిన అమెరికా!
- Kim Jong Un: కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైతే, ప్రళయమే.. ఉత్తరకొరియా సంచలన నిర్ణయం..
- US: ‘‘ఇది ఇండియా కాదు’’.. టెక్సాస్ గవర్నర్ అభ్యర్థిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు
ఇలా తరచూ ఏదో ఒక లోపం తలెత్తుతుండడంతో.. తొలుత వివరణ ఇవ్వాలంటూ డీజీసీఏ నోటీసులు పంపింది. ఆ వెంటనే మరో సమస్య వెలుగులోకి వచ్చింది. దుబాయ్ – మధురై విమానం బోయింగ్ బి737 మ్యాక్స్ ఫ్రంట్ వీల్ సరిగ్గా పని చేయలేదు. ఈ నేపథ్యంలోనే సీరియస్ అయిన కేంద్రం.. 8 వారాల పాటు కేవలం 50 శాతం విమాన సర్వీసులే నిర్వహించాలంటూ ఆంక్షలు విధించింది. ఇకనుంచైనా స్పైస్జెట్ సీరియస్గా వ్యవహరించి, ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్త పడేందుకు ఈ ఆంక్షలు విధించడం జరిగింది.
తాజావార్తలు
-
CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
-
PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్ పట్టాభిషేకం.. దళపతికి ప్రధాని మోడీ స్పెషల్ సందేశం..
-
Tamilanadu CM ViJay: రీల్ హీరో నుంచి రియల్ ముఖ్యమంత్రిగా విజయ్ తొలి స్పీచ్.. నాకు ఆకలి తెలుసు.. పేదరికం తెలుసు..
-
Sneha Ulla-Aishwarya :ఐశ్వర్య రాయ్ పోలికలే స్నేహా ఉల్లాల్కు శాపమయ్యాయా?
-
Samsung Mini LED TV: సామ్ సంగ్ మినీ LED టీవీ భారత్ లో విడుదల.. నెక్ట్స్ జెన్ AI ఫీచర్లతో ప్రీమియం ఎక్స్పీరియన్స్