Texas Floods: 104కి చేరిన టెక్సాస్ వరద మృతుల సంఖ్య.. కుటుంబాలకు కుటుంబాలే మృత్యువాత
- 104కి చేరిన టెక్సాస్ వరద మృతుల సంఖ్య
- కుటుంబాలకు కుటుంబాలే మృత్యువాత
- ముందస్తు హెచ్చరికలు లేకపోవడంతోనే భారీ నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆకస్మిక వరదలు టెక్సాస్ నగరాన్ని ఘోరంగా దెబ్బకొట్టింది. ఊహించని రీతిలో వరదలు సంభవించడంతో టెక్సాస్ అతలాకుతలం అయిపోయింది. నెలల తరబడి కురవాల్సిన వర్షం.. కొన్ని గంటల్లోనే కురవడంతో నిమిషాల వ్యవధిలోనే వరదలు ముంచెత్తేశాయి. పైగా వాతావరణ శాఖలో సిబ్బంది కొరత కారణంగా ముందు హెచ్చరికలు కూడా లేవు. దీంతో టెక్సాస్ నగర వాసులు ఊహించని ప్రళయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఒక్కసారిగా జలప్రళయం వచ్చినట్లు విపత్తు సంభవించడంతో కుటుంబాలకు కుటుంబాలే వరదల్లో కొట్టుకుపోయాయి. అర్ధరాత్రి కావడంతో తప్పించుకునే మార్గం లేక ప్రాణాలు పోయాయి.
ఇది కూడా చదవండి: Police Torture : యువకుడితో టాయిలెట్లో నీళ్లు తాగించిన పోలీసులు..!
Also Read
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
- PM Modi MCG Visit: యువ క్రికెటర్లతో ప్రధాని మోడీ ముచ్చట్లు.. భారత్-ఆస్ట్రేలియా స్పోర్ట్స్ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ప్రారంభం
- 900 Snakes Escape: పాముల పెంపక కేంద్రం మునిగి 900 నాగుపాములు బయటకు.. ప్రాణ భయంతో వణుకుతున్న ప్రజలు (వీడియో)
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
టెక్సాస్లో ఇప్పటి వరకు 104 మంది చనిపోయారని వైట్హౌస్ అధికారికంగా ప్రకటించింది. ఇక డజన్ల కొద్దీ గల్లంతైనట్లుగా అధికారులు పేర్కొన్నారు. సమ్మర్ క్యాంప్లో ఉన్న పిల్లల ఆచూకీ ఇంకా తెలియలేదు. చెట్లపై అనేక మంది శరీరాలు ప్రత్యక్షమయ్యాయి. చెట్లలోనూ… పుట్టల్లోనూ చిక్కుకున్న మృతదేహాలను సహాయ సిబ్బంది వెలికి తీస్తున్నారు.
ఇది కూడా చదవండి: YSR Jayanthi 2025: ఇడుపులపాయలో ప్రత్యేక ప్రార్థనలు.. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జగన్
కుండపోత వర్షం సంభవించడంతో గ్వాడాలుపే నది 45 నిమిషాల్లో 26 అడుగులు పెరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా ఊహించని రీతిలో వరద ముంచెత్తింది. ముందస్తు హెచ్చరికలు లేకపోవడంతో సమ్మర్ క్యాంప్లో ఉన్న బాలికలు గల్లంతయ్యారు. ఇంకొందరు అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో 28 మంది పిల్లలు ఉన్నారు. శుక్రవారం తెల్లవారుజామున టెక్సాస్ ప్రజలంతా మంచి గాఢనిద్రలో ఉన్నారు. అమాంతంగా వర్షాలు సంభవించడంతో నిద్రలోంచి తేరుకోలేకపోయారు. దీంతోనే ఎక్కువ ప్రాణనష్టం జరిగింది. పైగా ముందస్తు హెచ్చరికలు కూడా లేవు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. కానీ అప్పటికే ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్నారు. కానీ తప్పించుకునే మార్గం లేకుండా పోయింది.
ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్.. శుక్రవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఏరియల్ సర్వే నిర్వహించి జరిగిన విపత్తును పరిశీలించనున్నారు. అనంతరం అధికారులతో భేటీ అయి.. జరుగుతున్న సహాయ చర్యలపై అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలకు ట్రంప్ సంతాపం ప్రకటించారు.
Timelapse flooding of the Llano River on July 4th pic.twitter.com/59Tnn6NZG7
— Rob Dew (@DewsNewz) July 5, 2025
❗️UPDATE: 37 now DEAD in Texas floods — AP https://t.co/6byrF9m3MP pic.twitter.com/GxJOO5L7TR
— RT (@RT_com) July 5, 2025
తాజావార్తలు
-
Indian Student: ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి.. ఉజ్బెకిస్తాన్లో భారతీయ విద్యార్థిని హత్య..?
-
Ring Removal Tips: మీ ఉంగరం వేలికి ఇరుక్కుపోయిందా..? సింపుల్గా తీసే చిట్కాలు ఇవే..
-
Gudluri Ashok Babu: హీరోగా అవకాశం ఇస్తానంటూ రూ.3.5 కోట్ల మోసం.. ‘భాగమతి’ డైరెక్టర్పై కేసు నమోదు!
-
Timex Deepwater Meridian 300: టైమెక్స్ డీప్వాటర్ మెరిడియన్ 300 వాచ్ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!