ఒమిక్రాన్ దెబ్బ.. విమాన ఛార్జీలకు రెక్కలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒమిక్రాన్ వేరియంట్ను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సిద్ధం అవుతున్నాయి.. ఊహించని విధంగా స్పీడ్గా విస్తరిస్తూ వస్తున్న ఈ వేరియంట్ ఇప్పటికే 38 దేశాలను తాకినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించింది.. అయితే, ఇదే సమయంలో విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చాయి.. ఇప్పటికే ఒమిక్రాన్ బాధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరి చేశాయి ఆయా దేశాలు.. ఒమిక్రాన్ మరింత విజృంభిస్తే.. మరిన్ని ఆంక్షలు తప్పవని.. అంతర్జాతీయ ప్రయాణాలు పూర్తిస్థాయిలో రద్దుచేసే అవకాశం లేకపోలేదని ప్రచారం కూడా సాగుతోంది.. దీంతో చాలా మంది ట్రావెల్ టికెట్లు బుక్ చేసుకోవడానికి మొగ్గు చూపడంతో.. విమాన ఛార్జీలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయని.. దీనికి పండుగల సీజన్ కూడా తోడు కావడం కూడా విమాన ఛార్జీల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు..
Read Also: ఒమిక్రాన్ విజృంభణ.. 38 దేశాలకు పాకింది..
Also Read
- Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. "మరచిపోలేని గుణపాఠం చెబుతాం" అంటూ ఖమేనీ హెచ్చరిక
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయంతో భారత్ నుంచి అధిక రద్దీ ఉండే యూఏఈ, అమెరికా, బ్రిటన్, కెనడా లాంటి దేశాలకు విమాన చార్జీలు అమాంతం పెరిగిపోయినట్టు చెబుతున్నారు.. తాజా సమాచారం ప్రకారం ఢిల్లీ నుంచి కెనడాలోని టోరంటోకి గతంలో కనీస ఛార్జీ రూ.80వేలుగా ఉంటే.. ఇప్పుడు ఏకంగా అది రూ. 2.37 లక్షలకు చేరిపోయింది.. ఇక, ఢిల్లీ నుంచి లండన్కు గతంలో రూ. 60గా ఉంటే.. ఇప్పుడు రూ. 1.20 లక్షలు దాటేసింది.. ఢిల్లీ నుంచి దుబాయ్కి రూ. 20 వేలుగా ఉన్న టికెట్ ధర ఇప్పుడు రూ. 33 వేల వరకు పెరిగింది.. ఇతర దేశాలకు కూడా ఇదే పరిస్థితి ఉందని సమాచారం.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే రెట్టింపు డబ్బును ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా సరే.. కరోనా మరింత విస్తరించకముందే గమ్యానికి చేరుకోవాలని ప్రయాణికులు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడంలేదని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
-
H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
-
Rohit Sharma: ఎట్టకేలకు ఫామ్లోకి హిట్ మ్యాన్.. హాఫ్ సెంచరీ పూర్తి..
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!