అక్కడ పెరిగిన కరోనా కేసులు.. లాక్ డౌన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతూనే వుంది. అమెరికా వంటి దేశాల్లో కేసులు 8 లక్షల వరకూ వుండడం ఆందోళన కలిగించాయి. తాజాగా అన్ని దేశాల్లోనూ కరోనా కేసులు తీవ్రంగా వచ్చిపడుతున్నాయి. దీంతో విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా పసిఫిక్ దీవుల్లోని కొన్నిదేశాల్లో ఇప్పటిదాకా అక్కడ ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ, ఒమిక్రాన్ పుణ్యమా అని వేరే దేశాల నుంచి వచ్చినవారితో అక్కడ తొలిసారి కేసులు నమోదయ్యాయి.
దీంతో కిరిబాటి, సమోవ వంటి దేశాల్లో తాజాగా కేసులు బయటపడడంతో ఇవాళ లాక్ డౌన్ విధించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం కిరిబాటిలో ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.. సమోవాలో కేవలం రెండంటే రెండే కేసులు వచ్చాయి. అయినా ఆ దేశాలు కరోనా వైరస్ తమ దేశ పౌరుల ఆరోగ్యరీత్యా లాక్ డౌన్ విధించడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు ఓకే చెప్పాక ఫిజి నుంచి కిరిబాటికి వచ్చిన వారిలో డజన్ల కొద్దీ ప్యాసింజర్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. బ్రిస్బేన్ నుంచి ప్రజలను తీసుకొచ్చిన రీపాట్రియేషన్ విమానంలోని 15 మందికి కరోనా వచ్చింది. దీంతో ఆ రెండు దేశాలూ లాక్ డౌన్ ను ప్రకటించాయి.
Also Read
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
- Iran - Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
- Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
ప్రస్తుతం వచ్చిన కేసులన్నీ ఒమిక్రాన్ కేసులే అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమోవా ప్రధాని ఫియామి నవోమీ మతాఫా దీనిపై స్పందించారు. విదేశాల నుంచి తమ దేశం వచ్చినవారిలో అందరూ క్వారంటైన్ లోనే ఉన్నారని, సోమవారం రాత్రికి ఆంక్షలను ఎత్తేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆమె అన్నారు. ఇక, కిరిబాటిలో సమూహ వ్యాప్తి మొదలు కావడం, ఒక కేసు రావడంతో రాజధానిలో ఆంక్షలు విధించామని కిరిబాటి అధ్యక్షుడు తానేటి మామూ చెప్పారు. ఆహారం, ఆరోగ్యం వంటి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలన్నారు.
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!