Iraq clashes: ఇరాక్ ఘర్షణల్లో 20కి చేరిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iraq clashes: రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు మతపెద్ద ప్రకటించడంపై షియా మతపెద్ద ముక్తాదా అల్-సదర్ మద్దతుదారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య 20కి చేరుకుందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇరాక్లో శక్తిమంతమైన నాయకుల్లో ఒకరిగా పేరున్న ముక్తాదా అల్ సదర్ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం ప్రకటించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆయన మద్దతుదారులు పలు ప్రావిన్సుల్లో ప్రభుత్వం కార్యాలయాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించగా.. భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో దాదాపు 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణల్లో 300 మందికి పైగా గాయపడ్డారు. ముక్తాదా అల్-సదర్ సోమవారం తన వేలాది మంది అనుచరులతో కలిసి ఇరాక్ అధ్యక్ష భవనంపై దాడి చేశారు. నిరసనకారుల హింస, ఆయుధాల వినియోగం ఆపే వరకు ముక్తాదా అల్-సదర్ నిరాహార దీక్షను ప్రకటించారు.
Abhijit Sen Passes Away: ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ కన్నుమూత
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్ సైన్యం ఆ దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. గత ఏడాది అక్టోబరులో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో అల్ సదర్ పార్టీ అత్యధిక సీట్లు సాధించింది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీ మార్కును మాత్రం చేరుకోలేకపోయింది. ఆపై ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేయడంలోనూ విఫలమైంది. దీనివల్ల కొన్ని నెలలుగా దేశ రాజకీయాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గతంలో కూడా అల్ సదర్ పలు మార్లు రాజకీయాల నుంచి ప్రకటించి.. మళ్లీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం తెలిసిందే. పరిస్థితిని అదుపుచేయడానికి, హింసను నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత వర్గాలను యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కోరారు. అన్ని పార్టీలు, వర్గాలు తమ విభేదాలకు అతీతంగా ఎదగాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ గట్టిగా కోరుతున్నారని సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ప్రకటనలో తెలిపారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!