Iraq clashes: ఇరాక్ ఘర్షణల్లో 20కి చేరిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iraq clashes: రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు మతపెద్ద ప్రకటించడంపై షియా మతపెద్ద ముక్తాదా అల్-సదర్ మద్దతుదారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య 20కి చేరుకుందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఇరాక్లో శక్తిమంతమైన నాయకుల్లో ఒకరిగా పేరున్న ముక్తాదా అల్ సదర్ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం ప్రకటించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆయన మద్దతుదారులు పలు ప్రావిన్సుల్లో ప్రభుత్వం కార్యాలయాల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించగా.. భద్రతా బలగాలు కాల్పులు జరపడంతో దాదాపు 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణల్లో 300 మందికి పైగా గాయపడ్డారు. ముక్తాదా అల్-సదర్ సోమవారం తన వేలాది మంది అనుచరులతో కలిసి ఇరాక్ అధ్యక్ష భవనంపై దాడి చేశారు. నిరసనకారుల హింస, ఆయుధాల వినియోగం ఆపే వరకు ముక్తాదా అల్-సదర్ నిరాహార దీక్షను ప్రకటించారు.
Abhijit Sen Passes Away: ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ సేన్ కన్నుమూత
Also Read
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాక్ సైన్యం ఆ దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. గత ఏడాది అక్టోబరులో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో అల్ సదర్ పార్టీ అత్యధిక సీట్లు సాధించింది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజార్టీ మార్కును మాత్రం చేరుకోలేకపోయింది. ఆపై ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేయడంలోనూ విఫలమైంది. దీనివల్ల కొన్ని నెలలుగా దేశ రాజకీయాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గతంలో కూడా అల్ సదర్ పలు మార్లు రాజకీయాల నుంచి ప్రకటించి.. మళ్లీ ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడం తెలిసిందే. పరిస్థితిని అదుపుచేయడానికి, హింసను నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత వర్గాలను యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కోరారు. అన్ని పార్టీలు, వర్గాలు తమ విభేదాలకు అతీతంగా ఎదగాలని ఐక్యరాజ్యసమితి చీఫ్ గట్టిగా కోరుతున్నారని సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ ప్రకటనలో తెలిపారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!