China: చైనా కుతంత్రం.. ఎల్ఏసీ వెంబడి పోరాట సన్నద్ధతను పరిశీలించిన అధ్యక్షుడు జిన్పింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India – China Border Issue: డ్రాగన్ కంట్రీ ఇండియా సరిహద్దుల్లో కుట్రలు చేయడం మానడం లేదు. ఏదో విధంగా భారత్ ను ఇబ్బంది పెడుతామని చూస్తోంది. గతంలో గాల్వాన్ ప్రాంతంలో ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో చైనా దురాక్రమణను భారత సైన్యం ధీటుగా అడ్డుకుంది. ఇదిలా ఉంటే తాజాగా చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ భారత సరిహద్దులో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) పోరాట సన్నద్ధతను పరిశీలించారు.
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
లడఖ్ సరిహద్దుల్లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉన్న చైనా సైనికులతో జిన్ పింగ్ వీడియో సంభాషణ నిర్వహించారు. వారి పోరాట సన్నద్ధతను పరిశీలించినట్లు చైనీస్ మీడియా వెల్లడించింది. జిన్జియాంగ్ మిలిటరీ కమాండ్ లోని ఖుంజేరాబ్ లోని సరిహద్దు రక్షణ పరిస్థితిపై పీపుల్ లిబరేషన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి, చైనా ఆర్మీ అధినేత అయిన జిన్ పింగ్ సైనికులతో సరిహద్దు పరిస్థితిని సమీక్షించారు. ఇటీవల సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది..? సైన్యంపై ప్రభావం ఎలా ఉందనే విషయాలను చర్చించినట్లు తెలిసింది. సరిహద్దుల్లో 24 గంటలు పర్యవేక్షిస్తున్నామని సైనికులు జిన్ పింగ్ కు తెలిపారు. సైనికుల సరిహద్దు రక్షణను జిన్ పింగ్ కొనియాడారు, మరింత సహకారాన్ని అందిస్తామని వెల్లడించారు.
తూర్పు లడఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు, గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులు మధ్య మే5, 2020న హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ఇరు వైపుల సైనికులు మరణించారు. అయితే భారత్ కన్నా, చైనా సైనికులే అధికంగా చనిపోయారని పాశ్చాత్య మీడియా తెలిపింది. అయితే చైనా మాత్రం దీనిని అంగీకరించడం లేదు. ఈ ప్రతిష్టంభనతో ఇరు వర్గాల మధ్య 17 రౌండ్ల ఉన్నతస్థాయి సైనిక చర్చలు జరిగాయి.
తాజావార్తలు
-
‘Peddi’: టాలీవుడ్ అంటే అంత అలుసా? ‘పెద్ది’ విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!