China: చైనా కుతంత్రం.. ఎల్ఏసీ వెంబడి పోరాట సన్నద్ధతను పరిశీలించిన అధ్యక్షుడు జిన్పింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India – China Border Issue: డ్రాగన్ కంట్రీ ఇండియా సరిహద్దుల్లో కుట్రలు చేయడం మానడం లేదు. ఏదో విధంగా భారత్ ను ఇబ్బంది పెడుతామని చూస్తోంది. గతంలో గాల్వాన్ ప్రాంతంలో ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్ లో చైనా దురాక్రమణను భారత సైన్యం ధీటుగా అడ్డుకుంది. ఇదిలా ఉంటే తాజాగా చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ భారత సరిహద్దులో చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) పోరాట సన్నద్ధతను పరిశీలించారు.
Also Read
- Pakistan: అసిమ్ మునీర్ గుట్టు బట్టబయలు.. న్యూక్లియర్ డీల్ కోసం చైనాకు పాక్ తాకట్టు.!
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Donald Trump: త్వరగా నిర్ణయం తీసుకోండి, లేకపోతే మీకు ఏమీ మిగలదు.. ఇరాన్ను మళ్లీ హెచ్చరించిన ట్రంప్
లడఖ్ సరిహద్దుల్లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉన్న చైనా సైనికులతో జిన్ పింగ్ వీడియో సంభాషణ నిర్వహించారు. వారి పోరాట సన్నద్ధతను పరిశీలించినట్లు చైనీస్ మీడియా వెల్లడించింది. జిన్జియాంగ్ మిలిటరీ కమాండ్ లోని ఖుంజేరాబ్ లోని సరిహద్దు రక్షణ పరిస్థితిపై పీపుల్ లిబరేషన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి, చైనా ఆర్మీ అధినేత అయిన జిన్ పింగ్ సైనికులతో సరిహద్దు పరిస్థితిని సమీక్షించారు. ఇటీవల సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది..? సైన్యంపై ప్రభావం ఎలా ఉందనే విషయాలను చర్చించినట్లు తెలిసింది. సరిహద్దుల్లో 24 గంటలు పర్యవేక్షిస్తున్నామని సైనికులు జిన్ పింగ్ కు తెలిపారు. సైనికుల సరిహద్దు రక్షణను జిన్ పింగ్ కొనియాడారు, మరింత సహకారాన్ని అందిస్తామని వెల్లడించారు.
తూర్పు లడఖ్ లోని పాంగాంగ్ త్సో సరస్సు, గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులు మధ్య మే5, 2020న హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో ఇరు వైపుల సైనికులు మరణించారు. అయితే భారత్ కన్నా, చైనా సైనికులే అధికంగా చనిపోయారని పాశ్చాత్య మీడియా తెలిపింది. అయితే చైనా మాత్రం దీనిని అంగీకరించడం లేదు. ఈ ప్రతిష్టంభనతో ఇరు వర్గాల మధ్య 17 రౌండ్ల ఉన్నతస్థాయి సైనిక చర్చలు జరిగాయి.
తాజావార్తలు
-
DMK: సీఎం విజయ్ ప్రభుత్వం 6 నెలల్లోపే కూలిపోతుంది..
-
HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
-
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
-
CM Vijay: ముఖ్యమంత్రిగా ఢిల్లీ టూర్కు విజయ్.. ప్రధాని మోడీని ఎప్పుడు కలవబోతున్నారంటే..!
-
Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..