Pfizer Vaccine: దుమారం రేపుతోన్న ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్.. కొనుగోలు చేయాలని ప్రధానిపై కాంగ్రెస్ ఒత్తిడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pfizer tried bullying India: అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ భారత్ తో దుమారాన్ని రేపుతోంది. ఫైజర్ వ్యాక్సిన్ సమర్థతపై అనుమానాలు వస్తున్న నేపథ్యంలో కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ట్వీట్ కాంగ్రెస్, బీజేపీ మధ్య పొలిటికల్ రచ్చకు దారితీసింది. కరోనా మొదటి వేవ్ సమయంలో స్వదేశీ వ్యాక్సిన్లను ఎంచుకోవడం కన్నా, విదేశీ తయారీ వ్యాక్సిన్లను కొనుగోలు చేయాలని ప్రతిపక్ష నేతలు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఒత్తడి తీసుకువచ్చారని ఆరోపించారు. దీంతో ఫైజర్ కంపెనీ భారత ప్రభుత్వం నుంచి చట్టపరమైన రక్షణను కోరినట్లు భారత ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేసింది. దీని వల్ల భవిష్యత్తులో చట్టపరమైన దావాల నుంచి మినహాయింపులు వస్తాయని ఆ కంపెనీ భావించింది.
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లాను మీడియా ప్రశ్నలు అడిగింది. కరోనాపై వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేయడం లేదని..దీన్ని మీరు ఎందుకు దాచారంటూ మీడియా ప్రశ్నించింది. మొదటగా 100 శాతం పనిచేస్తుందని.. ఆ తరువాత 80, 70 శాతం సమర్థంగా ఉంటుందని మీరు చెప్పారు కానీ వ్యాక్సిన్ కరోనా వ్యాప్తిని అరికట్టలేకపోతుందని జర్నలిస్టులు ప్రశ్నించారు. అయితే దీనికి సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ఈ వీడియోను జోడిస్తూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు.
Also Read
Just to remind all Indians, that Pfizer tried to bully Govt of India into accepting conditions of indemity
And Cong trio of Rahul, Chidamabaram n Jairam Ramesh kept pushing case of foreign vaccines during Covid 🤮🤬🥵 https://t.co/nT5LHI07hc
— Rajeev Chandrasekhar 🇮🇳 (@RajeevRC_X) January 20, 2023
Read Also: Coronavirus : కరోనా వచ్చిపోయిందని సంబరపడుతున్నారా.. 18నెలలు డేంజర్లో ఉన్నట్లే
ఫైజర్ తన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ సరఫరా చేయడానికి భారత ప్రభుత్వాన్ని బెదిరించే ప్రయత్నం చేసిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారం తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ, చిదంబరం, జైరాం రమేష్ విదేశీ వ్యాక్సిన్లను కొనుగోలు చేసేలా భారత ప్రభుత్వంపై ఒత్తిడి చేశారని ఆరోపించారు. చిదంబర్ డిసెంబర్ 27, 2021న ‘‘భారతదేశంలో కేవలం మూడు వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులోకి రావడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు: కోవిషీల్డ్, కోవాక్సిన్ మరియు స్పుత్నిక్ ఈ మూడింటిలో, మీరు స్పుత్నిక్ను రద్దు చేయవచ్చు, ఎందుకంటే ప్రారంభ రోజులలో తక్కువ పరిమాణంలో మాత్రమే దిగుమతి చేసుకున్నారు కాబట్టి’’ అంటూ ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే భారత్ దేశీయంగా తయారు చేసిన వ్యాక్సిన్ల ద్వారా కరోనాను కట్టడి చేసింది. ఎంతో గొప్పగా చెప్పుకున్న చైనా వ్యాక్సిన్లు, అమెరికా వ్యాక్సిన్లు కూడా భారత వ్యాక్సిన్ల ముందు చిన్నబోయాయి. అక్కడ ఇప్పటికీ కోవిడ్ వ్యాప్తి చెందుతూనే ఉంది. భారత తయారీ కోవీషీల్డ్, కోవాగ్జిన్లను ప్రజలకు ఇచ్చింది. ఇప్పటి వరకు 220.16 కోట్ల డోసులను ప్రజలకు రెండేళ్ల వ్యవధిలో ఇచ్చారు.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!