చైనా మరో కీలక నిర్ణయం.. ఇక, ముగ్గురు పిల్లలను కనొచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలోనే జనాభాలో నంబర్ వన్గా ఉన్న చైనా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది.. జనాభా నియంత్రణకు ఒకప్పుడు ఒక్కరిని మాత్రమే కనాలని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.. ఆ తర్వాత దానిని సవరిస్తూ.. ఇద్దరిని కనొచ్చు అంటూ కొత్త రూల్ తెచ్చింది.. ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీలో మార్పులు చేసిన చైనా.. ఇక నుంచి చైనాలో జంటలు గరిష్ఠంగా ముగ్గురు పిల్లలను కూడా కనొచ్చని తెలిపిందిఏ.. దీని ముఖ్య కారణంలో.. ఆ దేశంలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగిపోవడమే.. కాగా, పెరిగిపోతోన్న జనాభాను నియంత్రించేందుకు.. 1970 నుంచి 2016 వరకు ఒకే సంతానం అనే నినాదాన్ని అమలు చేసింది డ్రాగన్ కంట్రీ.. ఇక, 2016 నుంచి ఇద్దరు పిల్లలను కనడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఇప్పుడు ఆ సంఖ్యను ముగ్గురికి పెంచడం విశేషం. దీనికి ఆ దేశ అధ్యక్షుడు, సీపీసీ ప్రధాన కార్యదర్శి జీ జిన్పింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర కమిటీ ఆమోదం తెలిపింది. చైనా జనాభా నిర్మాణ పద్ధతిని వృద్ధి చేయడానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక, ముగ్గరు పిల్లల విధానాన్ని చట్టానికి అనుగుణంగా అమలు చేయడానికి పార్టీ కమిటీలు మరియు ప్రభుత్వాలు అన్ని స్థాయిలలో ప్రణాళికబద్దంగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.. అన్ని స్థాయిలలోని అధికారులు జననాలు, సంబంధిత ఆర్థిక మరియు సామాజిక విధానాల సమన్వయాన్ని ప్రోత్సహించాలని.. మరియు ప్రధాన ఆర్థిక మరియు సామాజిక విధానాల జనాభా ప్రభావ అంచనా విధానాన్ని మెరుగుపర్చాలని ఆదేశించారు. 2016 లో ఇద్దరు పిల్లల విధానాన్ని అమలు చేసిన ఐదు సంవత్సరాల తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు.. ఇది నిపుణుల అభిప్రాయం ప్రకారం, చైనా యొక్క వృద్ధాప్య సమాజం యొక్క సమస్యను ఎదుర్కోవటానికి తీసుకున్నదిగా చెబుతున్నారు.. మే నెలలో బహిరంగంగా చేసిన తాజా జనాభా లెక్కల ప్రకారం, చైనా జనాభా దశాబ్దాలలో అత్యంత మందకొడిగా పెరుగుతోందని వెల్లడించింది, గత దశాబ్దంలో దేశం కేవలం 72 మిలియన్లను మాత్రమే చేర్చింది. గత 10 సంవత్సరాల్లో సగటు వార్షిక వృద్ధి రేటు 0.53 శాతం, ఇది 2000 మరియు 2010 మధ్య 0.57 శాతం తగ్గింది – జనాభాను 1.41 బిలియన్లకు తీసుకువచ్చింది… ప్రధాన భూభాగంలో మొత్తం జనాభా సంఖ్య నవంబర్ 1, 2020 నాటికి 1.41178 బిలియన్లుగా ఉంది. జనాభా వృద్ధి రేటులో తిరోగమనంతో 2016 లో వన్-చైల్డ్ పాలసీని ఉపసంహరించుకున్నప్పటికీ – వేగంగా వృద్ధాప్యంలో ఉన్న జనాభా మరియు అదనపు ఆర్థిక భారం తో ఎక్కువ జనాభా కలిగిన దేశం వ్యవహరిస్తున్నందున, తాజా నిర్ణయం తీసుకున్నారు.
Also Read
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
- China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!