China Covid: చైనాకు ఊరట.. కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China says Covid deaths down by nearly 80 percent: ఇంతకాలం కరోనా దెబ్బకు అతలాకుతలమైన చైనాకు ఇప్పుడు కాస్త ఊరట లభించింది. ఆ దేశంలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. జనవరి మొదట్లో పీక్ స్టేజ్లో కేసులు, మరణాలు సంభవించగా.. ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. రిపోర్ట్స్ ప్రకారం.. జనవరి మొదటి వారంతో పోలిస్తే కరోనా కేసులు 72 శాతం, మరణాలు 79 శాతం తగ్గాయి. ఈ విషయాన్ని చైనా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ఇటీవల ఓ ప్రభుత్వ శాస్త్రవేత్త చైనాలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని, ఇప్పటికే చైనా జనాభాలో 80శాతం మంది కరోనా బారినపడ్డారని, త్వరలోనే మరో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేసేందుకే.. చైనా ప్రభుత్వం తాజాగా కరోనా లెక్కలను అధికారికంగా వెల్లడించింది. ప్రభుత్వం లెక్కల ప్రకారం.. జనవరి 4వ తేదీన 1,28,000 కరోనా రోగులుండగా, జనవరి 23 నాటికి ఆ సంఖ్య 36,000కు పడిపోయింది. జనవరి మొదట్లో రోజుకు 4,273 మరణాలు నమోదవ్వగా.. ఇప్పుడు ఆ సంఖ్య 896కు దిగొచ్చింది. జ్వరంతో ఆస్పత్రుల్లో చేరుతున్న రోగ్యుల సంఖ్య డిసెంబర్ 22న 28 లక్షలుండగా.. జనవరి 23 నాటికి ఆ సంఖ్య లక్షా 11వేలకు తగ్గింది.
Shardul Thakur: వరల్డ్కప్ జట్టులో శార్దూల్కి చోటు.. అంతలేదన్న మాజీ క్రికెటర్
Also Read
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
- China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
కాగా.. గతేడాది చైనాలో కరోనా విలయతాండవం చేసిన సంగతి తెలిసిందే! మరీ ముఖ్యంగా.. అక్కడ జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తేసిన తర్వాత కేసులు గణనీయంగా పెరిగాయి. ఆసుపత్రులు రోగులతో నిండిపోగా.. స్మశానవాటికల ముందు శవాలు క్యూ కట్టేశాయి. ఇది చూసి.. చైనాలో రానున్న రోజుల్లో మరింత దుర్భర పరిస్థితులు వెలుగుచూస్తాయని కొన్ని విశ్లేషణలు వచ్చాయి. చైనావ్యాప్తంగా కేసులతో పాటు మరణాల సంఖ్య విపరీతంగా పెరగొచ్చని అంచనాలూ వచ్చాయి. అయితే.. చైనా ప్రభుత్వం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందంటూ తాజాగా అధికారిక లెక్కల్ని వెల్లడించింది. అయితే.. చైనా వెల్లడించిన వివరాలపై నమ్మకం లేదంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే సందేహాలు వ్యక్తపరిచింది. తన ప్రతిష్టని కాపాడుకోవడం కోసం చైనా సరైన లెక్కల్ని తెలపడం లేదని, దీంతో అక్కడి మహమ్మారి తీవ్రతను పసిగట్టలేకపోతున్నాయని WHO చెప్పింది.
Prabhas: సింగిల్ కింగులం నుంచి నువ్వెప్పుడూ బయటపడతావ్ డార్లింగ్
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!