China Covid: చైనాకు ఊరట.. కరోనా కేసులు, మరణాలు తగ్గుముఖం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China says Covid deaths down by nearly 80 percent: ఇంతకాలం కరోనా దెబ్బకు అతలాకుతలమైన చైనాకు ఇప్పుడు కాస్త ఊరట లభించింది. ఆ దేశంలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. జనవరి మొదట్లో పీక్ స్టేజ్లో కేసులు, మరణాలు సంభవించగా.. ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. రిపోర్ట్స్ ప్రకారం.. జనవరి మొదటి వారంతో పోలిస్తే కరోనా కేసులు 72 శాతం, మరణాలు 79 శాతం తగ్గాయి. ఈ విషయాన్ని చైనా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ఇటీవల ఓ ప్రభుత్వ శాస్త్రవేత్త చైనాలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని, ఇప్పటికే చైనా జనాభాలో 80శాతం మంది కరోనా బారినపడ్డారని, త్వరలోనే మరో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి పరిస్థితి లేదని స్పష్టం చేసేందుకే.. చైనా ప్రభుత్వం తాజాగా కరోనా లెక్కలను అధికారికంగా వెల్లడించింది. ప్రభుత్వం లెక్కల ప్రకారం.. జనవరి 4వ తేదీన 1,28,000 కరోనా రోగులుండగా, జనవరి 23 నాటికి ఆ సంఖ్య 36,000కు పడిపోయింది. జనవరి మొదట్లో రోజుకు 4,273 మరణాలు నమోదవ్వగా.. ఇప్పుడు ఆ సంఖ్య 896కు దిగొచ్చింది. జ్వరంతో ఆస్పత్రుల్లో చేరుతున్న రోగ్యుల సంఖ్య డిసెంబర్ 22న 28 లక్షలుండగా.. జనవరి 23 నాటికి ఆ సంఖ్య లక్షా 11వేలకు తగ్గింది.
Shardul Thakur: వరల్డ్కప్ జట్టులో శార్దూల్కి చోటు.. అంతలేదన్న మాజీ క్రికెటర్
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
కాగా.. గతేడాది చైనాలో కరోనా విలయతాండవం చేసిన సంగతి తెలిసిందే! మరీ ముఖ్యంగా.. అక్కడ జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తేసిన తర్వాత కేసులు గణనీయంగా పెరిగాయి. ఆసుపత్రులు రోగులతో నిండిపోగా.. స్మశానవాటికల ముందు శవాలు క్యూ కట్టేశాయి. ఇది చూసి.. చైనాలో రానున్న రోజుల్లో మరింత దుర్భర పరిస్థితులు వెలుగుచూస్తాయని కొన్ని విశ్లేషణలు వచ్చాయి. చైనావ్యాప్తంగా కేసులతో పాటు మరణాల సంఖ్య విపరీతంగా పెరగొచ్చని అంచనాలూ వచ్చాయి. అయితే.. చైనా ప్రభుత్వం మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందంటూ తాజాగా అధికారిక లెక్కల్ని వెల్లడించింది. అయితే.. చైనా వెల్లడించిన వివరాలపై నమ్మకం లేదంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థే సందేహాలు వ్యక్తపరిచింది. తన ప్రతిష్టని కాపాడుకోవడం కోసం చైనా సరైన లెక్కల్ని తెలపడం లేదని, దీంతో అక్కడి మహమ్మారి తీవ్రతను పసిగట్టలేకపోతున్నాయని WHO చెప్పింది.
Prabhas: సింగిల్ కింగులం నుంచి నువ్వెప్పుడూ బయటపడతావ్ డార్లింగ్
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
-
Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!