China: పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య చైనా మధ్యవర్తిత్వం.. టిబెట్లో సమావేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: ఆఫ్ఘనిస్తాన్లో ప్రజా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అందరి కన్నా ఎక్కువగా సంతోషించింది పాకిస్తాన్. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. భస్మాసుర హస్తంలా పాకిస్తాన్ దేశాన్ని నాశనం చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య ఇటీవల కాలంలో సరిహద్దు తగాదాలు తీవ్రమయ్యాయి. దీంతో పాటు పాకిస్తాన్ తాలిబాన్లకు ఆఫ్ఘనిస్తాన్ సేఫ్ జోన్ గా ఉంది. దీంతో బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తరుచుగా ఉగ్రవాద ఘటనలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చైనా మధ్యవర్తిత్వం వహిస్తోంది. పాకిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ, ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ మధ్య భారత్ సరిహద్దుల్లో ఉన్న టిబెట్ ప్రాంతంలో చైనా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న శత్రుత్వం, దిగజారిన దౌత్య సంబంధాలను దారిలో పెట్టాలని చైనా భావిస్తోంది.
Also Read
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Donald Trump: ట్రంప్ మైండ్లో ఒబామా 'రెంట్ ఫ్రీ' సూట్.. వయసు తప్పులో కాలేసి బుక్కయిన అమెరికా ప్రెసిడెంట్!
Read Also: Covid-19: సింగపూర్లో మరో కోవిడ్ వేవ్.. ఆరోగ్య మంత్రి హెచ్చరికలు
ఇటీవల కాలంలో పాకిస్తాన్ లోని పలు పట్టణాలు, నగరాలపై ఆఫ్ఘనిస్తాన్ నుంచి దాడులు జరుగుతున్నాయని పాక్ ఆరోపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్లో శరణార్థులుగా ఉన్న ఆఫ్ఘన్లను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. తమ దేశంలో ఉగ్రవాద దాడులకు ఆఫ్ఘన్ పౌరులే కారణమని పాక్ ఆరోపిస్తోంది. అయితే పాక్ ఆరోపణల్ని ఆఫ్ఘన్ తోసిపుచ్చింది.
తాజా సమావేశాలు 2018లో పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, మంగోలియా, చైనా సభ్యులుగా ఏర్పడిన ట్రాన్స్-హిమాలయన్ ఫోరమ్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ లో భాగంగా జరిగాయి. అయితే చైనా మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్లో గ్వాదర్ పోర్టును ఆధునీకీకరించి సీపెక్ ప్రాజెక్టు ద్వారా పాకిస్తాన్ అంతటా రోడ్లు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి చైనాతో అనుసంధానిస్తుంది.
ఆఫ్ఘనిస్తాన్ లో చమురు అణ్వేషన, లిథియం మైనింగ్ పై చైనా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటేనే తమ దోపిడికి అడ్డు ఉండదని భావిస్తోంది డ్రాగన్ కంట్రీ. ప్రపంచం మొత్తం ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల పాలననను గుర్తించనప్పటికీ.. చైనా మాత్రం కాబూల్ లో రాయబార కార్యాలయం ఏర్పాటు చేసి రాయబారిని నియమించింది.
- Tags
- Afghanistan
- china
- Pakistan
- Taliban
- tibet
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!