Indian Army: అరుణాచల్లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
- అరుణాచల్లో చైనా చొరబాటు?
- భారత సైన్యం ఖండించింది
- కొత్తగా శిబిరాల ఏర్పాటు జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరుణాచల్ ప్రదేశ్లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు చొరబడ్డాయన్న వార్తలను భారత సైన్యం ఖండించింది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసిన కథనాలు పూర్తిగా అసత్యమని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
ఇటీవల కొన్ని స్థానిక వార్తా సంస్థలు, గత ఆరేళ్లలో అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సుబన్సిరి జిల్లాలో చైనా పీఎల్ఏ దళాలు చొరబడి శిబిరాలు ఏర్పాటు చేశాయని కథనాలు ప్రచురించాయి. ఈ కథనాలు స్థానిక నాహ్ గిరిజన సమాజానికి చెందిన ప్రతినిధులు చేసిన ఆరోపణల ఆధారంగా వెలువడ్డాయి. నాహ్ వెల్ఫేర్ సొసైటీ (NWS) అధ్యక్షుడు కెరు చాడర్ మాట్లాడుతూ, తమ పూర్వికుల భూములు, వేట ప్రాంతాలు, పశువుల మేత భూములను చైనా దళాలు ఆక్రమించుకున్నాయని, ముఖ్యంగా 2020 నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోందని ఆరోపించారు. అయితే, తమ భూములను ఎన్నో ఏళ్లుగా రక్షిస్తున్న భారత సైన్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
- France Heatwave: ఫ్రాన్స్ను హడలెత్తిస్తోన్న ఎండలు.. వెయ్యికి చేరిన మృతులు
- China: జిన్పింగ్కు సొంత సైన్యంపైనే నమ్మకం లేదా? చైనా పార్లమెంట్ నుంచి ఆరుగురు టాప్ మిలిటరీ కమాండర్ల అవుట్!
ఈ ఆరోపణల నేపథ్యంలో భారత సైన్యం స్పందిస్తూ, అరుణాచల్ ప్రదేశ్లో చైనా దళాల చొరబాటు లేదా కొత్తగా శిబిరాల ఏర్పాటు జరిగినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపింది. వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా ప్రచారం జరుగుతోందని పేర్కొంది. ఇదిలా ఉండగా, 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందగా, చైనా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అయితే, చైనా ఇప్పటివరకు తమ సైనికుల అధికారిక మరణాల సంఖ్యను వెల్లడించలేదు.
ప్రస్తుతం వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి పరిస్థితి స్థిరంగా ఉందని భారత సైన్యం తెలిపింది. పదవీ విరమణ చేస్తున్న భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ, సరిహద్దులో శాంతి, స్థిరత్వాన్ని కొనసాగించేందుకు భారత్-చైనా సైన్యాల మధ్య 1,100కు పైగా క్షేత్రస్థాయి సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇరుదేశాల మధ్య ఎలాంటి అపార్థాలు తలెత్తకుండా నిరంతర సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో, భారత సైన్యం శాంతి పరిరక్షణకు కట్టుబడి ఉన్నప్పటికీ, దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు ఎల్లప్పుడూ అప్రమత్తంగా, పూర్తి సామర్థ్యంతో సిద్ధంగా ఉంటుందని జనరల్ ద్వివేది స్పష్టం చేశారు. “బలంతో శాంతిని నెలకొల్పడం మా విధానం. ఎల్ఏసీ వెంబడి భారత సైన్యం దృఢమైన, విశ్వసనీయమైన రక్షణ వ్యవస్థతో దేశ ప్రయోజనాలను కాపాడుతోంది” అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Indian Army: అరుణాచల్లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!