Israel: ఇజ్రాయిల్ ఎలైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ‘‘యూనిట్ 8200’’ చీఫ్ రాజీనామా.. కారణం ఇదే..
- ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ‘‘యూనిట్ 8200’’ చీఫ్ రాజీనామా..
- అక్టోబర్ 07 నాటి హమాస్ దాడిని ఎదుర్కోకపోవడంతోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్ అత్యున్నత ఇంటెలిజెన్స్ ఎజెన్సీ ‘యూనిట్ 8200’ చీఫ్ రాజీనామా చేయనున్నట్లు ఆ దేశ సైన్యం గురువారం ప్రకటించింది. “8200 యూనిట్ కమాండర్, (బ్రిగేడియర్ జనరల్) యోస్సీ సారిల్, తన పదవినికి రాజీనామా చేయాలనే ఉద్దేశాన్ని తన కమాండర్లు మరియు సబార్డినేట్లకు తెలియజేసారు’’ అని ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే రోజుల్లో ఆయన తన పదవిని ముగించనున్నట్లు పేర్కొంది.
ఇజ్రాయిల్ ఎలైట్ ఇంటెలిజెన్స్గా ఉన్న యూనిట్ 8200, డీకోడింగ్ మరియు ఇంటర్సెప్ట్, ఇతర సిగ్నల్ ఇంటెలిజెన్స్ని విశ్లేషించే బాధ్యతల్ని కలిగి ఉంది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ విభాగం విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. అంతపెద్ద దాడికి హమాస్ ప్లాన్ చేస్తున్నా కూడా ఒక్క సమాచారం కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వద్ద లేకపోయింది. ఈ దాడి తర్వాత దాని కమాండర్ మేజర్ జనరల్ అహరోన్ హలీవా ఏప్రిల్ 2024లో తన రాజీనామాను ప్రకటించారు. అక్టోబర్ 7న జరిగిన దాడిని భగ్నం చేయడంలో డైరెక్టరేట్ విఫలమైందని హలీనాను విధుల నుంచి తప్పించాలని కోరినట్లు సైన్యం తెలిపింది.
Also Read
- Iran-US Tensions Escalate: అమెరికా ఆర్థిక ఆంక్షలకు మద్దతిస్తే ‘యుద్ధ చర్య’గానే చూస్తాం.. దేశాలకు ఇరాన్ హెచ్చరిక
- Modi-Trump: మోడీ–ట్రంప్ భేటీలో ట్విస్ట్.. ‘ప్రశ్నలు వద్దు’ అన్న భారత్, ట్రంప్ మాత్రం అడిగేశారు!
- Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
Read Also: Pakistan: పాకిస్తాన్లో ఆర్మీ వర్సెస్ పోలీస్.. సైన్యం తమ విధుల్లో జోక్యం చేసుకుంటుందని నిరసన..
అక్టోబర్ 7నాటి ఘటనను గురించి..మాకు అప్పగించిన మిషన్ని నెరవేర్చనందుకు క్షమాపణలు కోరుతూ సారిల్ తన రాజీనామా లేఖను అందించాడు. సెప్టెంబర్ 2023లో యూనిట్ 8200 తయారు చేసిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్లో హమాస్ దాడికి సన్నాహాలు చేస్తుందనే నిఘా సమాచారం ఉంది. యూనిట్ 8200 డాక్యుమెంట్లో బందీల కోసం శిక్షణ పొందిన ఎలైట్ హమాస్ యోధుల వివరాలు మరియు దక్షిణ ఇజ్రాయెల్లోని సైనిక స్థానాలు మరియు ఇజ్రాయెల్ కమ్యూనిటీలపై దాడులకు సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయి. అయితే, వీటిని పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఇజ్రాయిల్ దానిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
అక్టోబర్ 07 నాటి దాడిలో 1205 మందికి పైగా ఇజ్రాయిలీ ప్రజలు చంపబడ్డారు. 240 మంది బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. వీరిలో కొంత మంది చంపబడ్డారు. ఈ దాడి అనంతరం నుంచి ఇజ్రాయిల్ హమాస్పై దాడులు చేస్తోంది. దీని కారణంగా గాజాలో 40 వేలకు పైగా మరణించారు.
తాజావార్తలు
-
Anangsha Biswas: ‘నాతో ఉండు.. కారు, ఇల్లు ఇస్తా’.. 70 ఏళ్ల నిర్మాత మాటలకు షాక్.. భయంతో పారిపోయిన నటి!
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
Bank Strike Alert: బ్యాంక్ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఆరోజున దేశవ్యాప్త సమ్మె.. కీలక వివరాలు ఇవే
-
N. Ramchander Rao: ఫీజు రీయింబర్స్మెంట్పై బీజేపీ పోరుబాట.. సీఎం రేవంత్పై బీజేపీ చీఫ్ ఫైర్
-
IRUMUDI Collections : ఇరుముడి మూడు రోజుల కలెక్షన్స్.. ‘బ్లాక్బస్టర్’ ఈజ్ స్మాల్ వర్డ్
ట్రెండింగ్
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!