Israel: ఇజ్రాయిల్ ఎలైట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ‘‘యూనిట్ 8200’’ చీఫ్ రాజీనామా.. కారణం ఇదే..
- ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ గ్రూప్ ‘‘యూనిట్ 8200’’ చీఫ్ రాజీనామా..
- అక్టోబర్ 07 నాటి హమాస్ దాడిని ఎదుర్కోకపోవడంతోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్ అత్యున్నత ఇంటెలిజెన్స్ ఎజెన్సీ ‘యూనిట్ 8200’ చీఫ్ రాజీనామా చేయనున్నట్లు ఆ దేశ సైన్యం గురువారం ప్రకటించింది. “8200 యూనిట్ కమాండర్, (బ్రిగేడియర్ జనరల్) యోస్సీ సారిల్, తన పదవినికి రాజీనామా చేయాలనే ఉద్దేశాన్ని తన కమాండర్లు మరియు సబార్డినేట్లకు తెలియజేసారు’’ అని ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే రోజుల్లో ఆయన తన పదవిని ముగించనున్నట్లు పేర్కొంది.
ఇజ్రాయిల్ ఎలైట్ ఇంటెలిజెన్స్గా ఉన్న యూనిట్ 8200, డీకోడింగ్ మరియు ఇంటర్సెప్ట్, ఇతర సిగ్నల్ ఇంటెలిజెన్స్ని విశ్లేషించే బాధ్యతల్ని కలిగి ఉంది. అక్టోబర్ 07 నాటి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ విభాగం విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి. అంతపెద్ద దాడికి హమాస్ ప్లాన్ చేస్తున్నా కూడా ఒక్క సమాచారం కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వద్ద లేకపోయింది. ఈ దాడి తర్వాత దాని కమాండర్ మేజర్ జనరల్ అహరోన్ హలీవా ఏప్రిల్ 2024లో తన రాజీనామాను ప్రకటించారు. అక్టోబర్ 7న జరిగిన దాడిని భగ్నం చేయడంలో డైరెక్టరేట్ విఫలమైందని హలీనాను విధుల నుంచి తప్పించాలని కోరినట్లు సైన్యం తెలిపింది.
Also Read
- Buckingham Palace: రూ. 4,600 కోట్లు ఖర్చు పెట్టినా.. బకింహామ్ ప్యాలెస్ను వీడనున్న కింగ్ చార్లెస్!
- China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
- France: ఫ్రాన్స్లో ఎండలు భగభగ.. ఏసీల కోసం ఎగబడ్డ జనాలు
- Earthquake: దక్షిణ ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రత నమోదు
Read Also: Pakistan: పాకిస్తాన్లో ఆర్మీ వర్సెస్ పోలీస్.. సైన్యం తమ విధుల్లో జోక్యం చేసుకుంటుందని నిరసన..
అక్టోబర్ 7నాటి ఘటనను గురించి..మాకు అప్పగించిన మిషన్ని నెరవేర్చనందుకు క్షమాపణలు కోరుతూ సారిల్ తన రాజీనామా లేఖను అందించాడు. సెప్టెంబర్ 2023లో యూనిట్ 8200 తయారు చేసిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్లో హమాస్ దాడికి సన్నాహాలు చేస్తుందనే నిఘా సమాచారం ఉంది. యూనిట్ 8200 డాక్యుమెంట్లో బందీల కోసం శిక్షణ పొందిన ఎలైట్ హమాస్ యోధుల వివరాలు మరియు దక్షిణ ఇజ్రాయెల్లోని సైనిక స్థానాలు మరియు ఇజ్రాయెల్ కమ్యూనిటీలపై దాడులకు సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయి. అయితే, వీటిని పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఇజ్రాయిల్ దానిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
అక్టోబర్ 07 నాటి దాడిలో 1205 మందికి పైగా ఇజ్రాయిలీ ప్రజలు చంపబడ్డారు. 240 మంది బందీలుగా పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లారు. వీరిలో కొంత మంది చంపబడ్డారు. ఈ దాడి అనంతరం నుంచి ఇజ్రాయిల్ హమాస్పై దాడులు చేస్తోంది. దీని కారణంగా గాజాలో 40 వేలకు పైగా మరణించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!