India Partition: అపూర్వ కలయిక.. 75 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో కలుసుకున్న అన్నాచెల్లెలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brother and sister met after 75 years in pakistan: స్వాతంత్య్ర సంబరాలు ఓ వైపు, భారతదేశ విజభన మరోవైపు ఇలా రెండు భావోద్వేగాలు ఒకేసారి రగిలిన వేళ ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. పాకిస్తాన్, భారత్ విభజన సమయంలో చాలా మంది మతకల్లోల్లాల్లో మరణించారు. చాలా మంది పిల్లలు అనాథలుగా మిగిలారు. ఒకే కుటుంబానికి చెందిన వాళ్లు ఒకరు భారత్ లో ఉంటే మరొకరు పాకిస్తాన్ వెళ్లారు. చాలా మంది పిల్లల్ని దేశవిభజన వారి తల్లిదండ్రులకు దూరం చేసింది. తాజాగా దేశ విభజన సమయంలో విడిపోయిన అన్నాచెలెలు 75 ఏళ్ల తరువాత పాకిస్తాన్ లో కలుసుకున్నారు.
విభజన సమయంలో విడిపోయిన భారతీయ సిక్కు, తన పాకిస్తానీ ముస్లిం సోదరిని పాకిస్తాన్ లోని పంజాబ్ కర్తార్ పూర్ లో కలుసుకున్నారు. 75 ఏళ్ల తరువాత కలుసుకున్న అమర్ జీత్ సింగ్, తన సోదరి కుల్సూమ్ అక్తర్ ను కలుసుకున్నారు. ఏడు దశాబ్ధాల తరువాత కలుసుకున్న వీరిద్దరు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఒకరినొకరు కౌగిలించుకుని చాలా సేపు ఏడ్చారు. వీరిని చూసి స్థానికులు కూడా కన్నీటి పర్యంతం అయ్యారు.
Also Read
- Vladimir Putin: "భారత్ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
భారత విభజన సమయంలో అమర్ జిత్ సింగ్, తన ముస్లిం తల్లిదండ్రులతో విడిపోయారు. అమర్ జిత్ సింగ్ తో పాటు ఆయన సోదరిని తల్లిదండ్రులు ఇండియాలోనే ఉంచి పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సుకు వలస వెళ్లారు. 1947 సమయంలో అమర్ జిత్ సింగ్, అతని సోదరిని పంజాబ్ జలంధర్ లో విడిచివెళ్లారు. ఆ తరువాత అమర్ జిత్ సింగ్ ను సిక్కు కుటుంబం దత్తత తీసుకుని పెంచుకుంది.
Read Also: Kishan Reddy: సెప్టెంబర్17న తెలంగాణ విమోచన దినోత్సవం.. వేడుకల్లో అమిత్ షా
ఇటీవల పాక్ వీసా పొందిన అమర్ జీత్ సింగ్, వాఘా అట్టారీ బార్డర్ దాటి పాకిస్తాన్ చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన సోదరి కుల్సూమ్, తన కుమారుడు షాజాద్ అహ్మద్, గ్రామస్తులతో కలిసి తన అన్న అమర్ జీత్ సింగ్ ను కలిసేందుకు వచ్చింది. తాను పాకిస్తాన్ వెళ్లిన తర్వాత జన్మించానని తన చిన్న తనంలో అన్న, అక్కలను తలుచుకుని తన తల్లి ఏడ్చేదని తెలిపింది. అయితే తన అన్నను కలుస్తానని ఊహించలేదని చెప్పింది.
అయితే కొన్నేళ్ల క్రితం ఆమె తండ్రి స్నేహితుడు సర్దార్ దారా సింగ్ పాకిస్తాన్ కు వచ్చినప్పుడు.. తన అన్న, అక్కల గురించిన సమాచాారాన్ని తల్లి చెప్పిందని.. వాళ్ల ఊరు పేరు, వాళ్ల ఇంటి చిరునామా చెప్పిందని.. దారా సింగ్ చిరునామా ప్రకారం పదవాన్ గ్రామంలో అమర్ జిత్ సింగ్ ను గుర్తించారు. వాట్సాప్ ద్వారా అన్నచెల్లెలు ఇద్దరు కలుసుకున్న తరువాత.. తాజాగా బుధవారం వారు పాకిస్తాన్ లో కలిశారు. అయితే అమర్ జిత్ సింగ్ తో ఉన్న మరో సోదరి చనిపోయింది.
తాజావార్తలు
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!