Joe Biden: ప్రపంచ నాయకులతో జో బైడెన్ అత్యవసర సమావేశం.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biden holds emergency roundtable meeting with world leaders: ఇండోనేషియా బాలిలో జీ-20 సమావేశాలు జరగుతున్నాయి. ఈ సమావేశాల్లో యూఎస్ ప్రెసిడెంట్ జో జైడెన్ కూడా పాల్గొన్నారు. తాజాగా ఆయన ప్రపంచ నాయకులతో అత్యవసరంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. మంగళవారం రష్యాకు సంబంధించిన ఓ మిస్సైల్ ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్ లో పడిందని ఆ దేశం ఆరోపిస్తోంది. అయితే రష్యా మాత్రం దీన్ని ఖండిస్తోంది. పోలాండ్ లో మిస్సైల్ కూలిపోవడంతో ఇద్దరు మరణించారు.
Read Also: Dog Attack: కుక్క దాడికి గురైన మహిళకు రూ.2 లక్షల పరిహారం
Also Read
నాటోలో సభ్యదేశం అయిన పోలాండ్ పై మిస్సైల్ పడటంతో నాటో దేశాలు రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై జీ-20 సమావేశంలో పాల్గొన్న బైడెన్, ప్రపంచ నేతలతో అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం బాలిలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నట్లు అమెరికా వెల్లడించింది. ఫ్రాన్స్, కెనడా, యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ ఇతర దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాటో, జీ-7 దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు అమెరికా వెల్లడించింది.
రష్యా చర్యను నాటో సభ్యదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పోలాండ్ లో రష్యా మిస్సైల్ పడిపోవడంపై అమెరికా, దాని మిత్రదేశాలు విచారణ సాగిస్తాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే జీ-20 సభ్యదేశాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ దేశాధినేతలు ఓ ప్రకటనపై సంతకాలు చేయబోతున్నారు. అయితే ఈ ప్రకటనపై ఎన్ని దేశాలు సంతకం చేయబోతున్నాయో అనే దానిపై స్పష్టత లేదు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచంపై ఆహార, ఇంధన సంక్షోభ ప్రభావం పడుతోంది. జీ-20 దేశాల తర్వాతి సమావేశం భారతదేశంలో జరగబోతున్నాయి. 2023కి గానూ భారత్ జీ-20 అధ్యక్ష బాధ్యతలు తీసుకోనుంది.
తాజావార్తలు
-
Hatah Teaser: కిరణ్ అబ్బవరం ‘హతః’ టీజర్కు ముహూర్తం ఫిక్స్.. ఆ నల్ల పిల్లి వెనుక అసలు కథేంటి?
-
Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
-
KBR Park Elevated Corridor: 14 వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!