Joe Biden: ప్రపంచ నాయకులతో జో బైడెన్ అత్యవసర సమావేశం.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biden holds emergency roundtable meeting with world leaders: ఇండోనేషియా బాలిలో జీ-20 సమావేశాలు జరగుతున్నాయి. ఈ సమావేశాల్లో యూఎస్ ప్రెసిడెంట్ జో జైడెన్ కూడా పాల్గొన్నారు. తాజాగా ఆయన ప్రపంచ నాయకులతో అత్యవసరంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. మంగళవారం రష్యాకు సంబంధించిన ఓ మిస్సైల్ ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్ లో పడిందని ఆ దేశం ఆరోపిస్తోంది. అయితే రష్యా మాత్రం దీన్ని ఖండిస్తోంది. పోలాండ్ లో మిస్సైల్ కూలిపోవడంతో ఇద్దరు మరణించారు.
Read Also: Dog Attack: కుక్క దాడికి గురైన మహిళకు రూ.2 లక్షల పరిహారం
Also Read
- Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
నాటోలో సభ్యదేశం అయిన పోలాండ్ పై మిస్సైల్ పడటంతో నాటో దేశాలు రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై జీ-20 సమావేశంలో పాల్గొన్న బైడెన్, ప్రపంచ నేతలతో అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం బాలిలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నట్లు అమెరికా వెల్లడించింది. ఫ్రాన్స్, కెనడా, యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ ఇతర దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాటో, జీ-7 దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు అమెరికా వెల్లడించింది.
రష్యా చర్యను నాటో సభ్యదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పోలాండ్ లో రష్యా మిస్సైల్ పడిపోవడంపై అమెరికా, దాని మిత్రదేశాలు విచారణ సాగిస్తాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే జీ-20 సభ్యదేశాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ దేశాధినేతలు ఓ ప్రకటనపై సంతకాలు చేయబోతున్నారు. అయితే ఈ ప్రకటనపై ఎన్ని దేశాలు సంతకం చేయబోతున్నాయో అనే దానిపై స్పష్టత లేదు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచంపై ఆహార, ఇంధన సంక్షోభ ప్రభావం పడుతోంది. జీ-20 దేశాల తర్వాతి సమావేశం భారతదేశంలో జరగబోతున్నాయి. 2023కి గానూ భారత్ జీ-20 అధ్యక్ష బాధ్యతలు తీసుకోనుంది.
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!