Joe Biden: ప్రపంచ నాయకులతో జో బైడెన్ అత్యవసర సమావేశం.. కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biden holds emergency roundtable meeting with world leaders: ఇండోనేషియా బాలిలో జీ-20 సమావేశాలు జరగుతున్నాయి. ఈ సమావేశాల్లో యూఎస్ ప్రెసిడెంట్ జో జైడెన్ కూడా పాల్గొన్నారు. తాజాగా ఆయన ప్రపంచ నాయకులతో అత్యవసరంగా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది. మంగళవారం రష్యాకు సంబంధించిన ఓ మిస్సైల్ ఉక్రెయిన్ సరిహద్దు దేశమైన పోలాండ్ లో పడిందని ఆ దేశం ఆరోపిస్తోంది. అయితే రష్యా మాత్రం దీన్ని ఖండిస్తోంది. పోలాండ్ లో మిస్సైల్ కూలిపోవడంతో ఇద్దరు మరణించారు.
Read Also: Dog Attack: కుక్క దాడికి గురైన మహిళకు రూ.2 లక్షల పరిహారం
Also Read
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- Oil Companies: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచినా.. ఇంకా నష్టాల్లోనే చమురు సంస్థలు.. కారణం ఇదే..
- PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
నాటోలో సభ్యదేశం అయిన పోలాండ్ పై మిస్సైల్ పడటంతో నాటో దేశాలు రష్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై జీ-20 సమావేశంలో పాల్గొన్న బైడెన్, ప్రపంచ నేతలతో అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు. బుధవారం ఉదయం బాలిలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నట్లు అమెరికా వెల్లడించింది. ఫ్రాన్స్, కెనడా, యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ ఇతర దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాటో, జీ-7 దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు అమెరికా వెల్లడించింది.
రష్యా చర్యను నాటో సభ్యదేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పోలాండ్ లో రష్యా మిస్సైల్ పడిపోవడంపై అమెరికా, దాని మిత్రదేశాలు విచారణ సాగిస్తాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే జీ-20 సభ్యదేశాలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ దేశాధినేతలు ఓ ప్రకటనపై సంతకాలు చేయబోతున్నారు. అయితే ఈ ప్రకటనపై ఎన్ని దేశాలు సంతకం చేయబోతున్నాయో అనే దానిపై స్పష్టత లేదు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచంపై ఆహార, ఇంధన సంక్షోభ ప్రభావం పడుతోంది. జీ-20 దేశాల తర్వాతి సమావేశం భారతదేశంలో జరగబోతున్నాయి. 2023కి గానూ భారత్ జీ-20 అధ్యక్ష బాధ్యతలు తీసుకోనుంది.
తాజావార్తలు
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!