Israel: ఇజ్రాయిల్ ప్రధానిగా నెతన్యాహు.. విజయం దాదాపుగా ఖరారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benjamin Netanyahu on the way to a huge victory in the Israeli elections: ఇజ్రాయిల్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం దిశగా దూసుకుపోతున్నారు బెంజిమిన్ నెతన్యాహు. ఇజ్రాయిల్ కు అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న ఆయన మరోసారి ఎన్నికల్లో విజయం సాధించనున్నారు. గురువారం అక్కడ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం అయింది. 87.6 శాతం ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి నెతన్యాహు లికుడ్ పార్టీ, దాని మిత్రపక్షాలు 65 స్థానాలు సాధించే స్థితికి చేరుకుంది. ఇందులో లికుడ్ పార్టీనే 61-62 సీట్లు సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 120 స్థానాలు ఉన్న ఇజ్రాయిల్ అసెంబ్లీలో 61 స్థానాలు సాధించిన పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. గత నాలుగేళ్లలో ఇజ్రాయిల్ లో జరుగుతున్న ఐదవ సాధారణ ఎన్నికలు ఇవి. 2015తో పోలిస్తే ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఎక్కువగా పోలింగ్ నమోదు అయింది.
Read Also: Twitter: ట్విట్టర్ ఉద్యోగులకు మస్క్ షాక్.. సగంమంది అవుట్?
Also Read
- Trump-Hegseth: ఇరాన్ యుద్ధంపై రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్పై ట్రంప్ ఆగ్రహం!
- Sheikh Hasina: "నరహంతకురాలు".. షేక్ హసీనా స్పీచ్పై బంగ్లాదేశ్ ఆగ్రహం..
- Iran: సుప్రీం లీడర్తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
జాతీయ భావాలు ఉన్న రైటిస్ట్ పార్టీ అయిన లికుడ్ పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారు. గతంలో అధికారంలో ఉన్న యాయిర్ లాపిత్, నఫ్తాలీ బెన్నెట్ ల సంక్షీర్ణ ప్రభుత్వంపై ఇజ్రాయిల్ ప్రజల్లో అసంతృప్తి ఉంది. దీంతో 73 ఏళ్ల బెంజిమిన్ నెతన్యాహూ లికుడ్ పార్టీకే ప్రజలు అధికారాన్ని కట్టబెట్టబోతున్నారు. లిఫ్ట్ పార్టీలు దాని మిత్ర పక్షాలకు కలిసి కేవలం 54-55 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే నెతన్యాహూకు అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి.
ఇజ్రాయిల్ లో 2019 నుంచి రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. లంచ, మోసం, విశ్వాస ఉల్లంఘన ఆరోపణలతో నెతన్యాహు పదవి నుంచి దిగిపోయారు. ఆ తరువాత యాయిర్ లాపిత్ ఇజ్రాయిల్ ప్రధాని అయ్యారు. నఫ్తాలీ బెన్నెట్, అరబ్ పార్టీల సహకారంతో ఆయన లాపిత్ పదవిని చేపట్టారు. మితవాద పార్టీ వ్యక్తి అయిన లాపిత్ పాలనలో ఇజ్రాయిల్ రక్షణ, పెరుగుతున్న ద్రవ్యోల్భనంపై అక్కడి ప్రజల్లో భయాలు పెరిగాయి. దీంతోనే ప్రజలు అధికార మార్పును కొరుకున్నట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. పలు కొత్త విధానాలకు గ్రీన్ సిగ్నల్
-
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
-
CJP: ‘క్యా బోల్తీ పబ్లిక్’.. దేశవ్యాప్త ప్రచారానికి సీజేపీ సిద్ధం..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!