Mehul Choksi: బెల్జియంలో భారత్ మోస్ట్ వాంటెడ్ మహుల్ చోక్సీ.. యూరోపియన్ దేశం నిర్ధారణ
- బెల్జియంలో భారత్ మోస్ట్ వాంటెడ్ మహుల్ చోక్సీ
- నిర్ధారించిన యూరోపియన్ దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో భారతదేశం మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ప్రస్తుతం బెల్జియంలో ఉన్నట్లు యూరోపియన్ దేశం నిర్ధారించింది. బెల్జియం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో అతని ఆచూకీ తెలిపింది. ఇక వ్యక్తిగత కేసులపై తాము వ్యాఖ్యానించబోమని పేర్కొంది. అయినప్పటికీ కేసు యొక్క పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. చోక్సీ అప్పగింతపై భారత అధికారులు తమను సంప్రదించినట్లుగా బెల్జియన్ అధికారులు నిర్ధారించారు. ఇదే కేసులో సహ నిందితుడైన అతని మేనల్లుడు నీరవ్ మోడీని కూడా లండన్ నుంచి రప్పించేందుకు భారత అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: CBI Raids: మద్యం కుంభకోణం కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు..
Also Read
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Kashmir Issue: పాకిస్థాన్పై భారత్ ఆగ్రహం.. ఉగ్రవాదాన్ని పెంచే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం..
- Trump: క్లైమాక్స్ చేరుకున్న అమెరికా, ఇరాన్ దేశాల ఉద్రిక్తతలు? ఇరాన్కు ట్రంప్ లాస్ట్ వార్నింగ్!
- US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,500 కోట్ల రుణ మోసం కేసులో నీరవ్ మోడీతో కలిసి నిందితుడిగా ఉన్న 65 ఏళ్ల చోక్సీ.. బెల్జియం పౌరురాలు అయిన భార్య ప్రీతి చోక్సీతో కలిసి ప్రస్తుతం ఆంట్వెర్ప్లో నివసిస్తున్నాడు. అయితే ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: AP News: రేపు చంద్రగిరిలో ఒక ఎంపీపీ, రెండు ఉప సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ను దాదాపు రూ.13,500 కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం చోక్సీ, నీరవ్ మోడీ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా-బార్బుడాకు పారిపోగా.. నీరవ్ మోడీ బ్రిటన్ పారిపోయాడు. వీరిని భారత్కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటీవల ఇండియా పర్యటనకు వచ్చిన ఆంటిగ్వా-బార్బుడా విదేశాంగ మంత్రి ఈపీ ఛెత్ గ్రీన్ మాట్లాడుతూ.. మెహుల్ చోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేరని, వైద్యం కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. చోక్సీ తమ దేశ పౌరుడేనని పేర్కొంటూ.. ఆయన్ను అప్పగించే విషయంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.
తాజావార్తలు
-
Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్టైమ్ రికార్డ్!
-
IPL 2026 Playoffs Race: ముంబైపై కేకేఆర్ విజయం.. సీఎస్కే ప్లేఆఫ్స్ ఛాన్సెస్ గల్లంతే, దేవుడు దిగొస్తే తప్ప!
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!