Mehul Choksi: బెల్జియంలో భారత్ మోస్ట్ వాంటెడ్ మహుల్ చోక్సీ.. యూరోపియన్ దేశం నిర్ధారణ
- బెల్జియంలో భారత్ మోస్ట్ వాంటెడ్ మహుల్ చోక్సీ
- నిర్ధారించిన యూరోపియన్ దేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రుణ మోసం కేసులో భారతదేశం మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ ప్రస్తుతం బెల్జియంలో ఉన్నట్లు యూరోపియన్ దేశం నిర్ధారించింది. బెల్జియం విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో అతని ఆచూకీ తెలిపింది. ఇక వ్యక్తిగత కేసులపై తాము వ్యాఖ్యానించబోమని పేర్కొంది. అయినప్పటికీ కేసు యొక్క పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. చోక్సీ అప్పగింతపై భారత అధికారులు తమను సంప్రదించినట్లుగా బెల్జియన్ అధికారులు నిర్ధారించారు. ఇదే కేసులో సహ నిందితుడైన అతని మేనల్లుడు నీరవ్ మోడీని కూడా లండన్ నుంచి రప్పించేందుకు భారత అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: CBI Raids: మద్యం కుంభకోణం కేసు.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు..
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13,500 కోట్ల రుణ మోసం కేసులో నీరవ్ మోడీతో కలిసి నిందితుడిగా ఉన్న 65 ఏళ్ల చోక్సీ.. బెల్జియం పౌరురాలు అయిన భార్య ప్రీతి చోక్సీతో కలిసి ప్రస్తుతం ఆంట్వెర్ప్లో నివసిస్తున్నాడు. అయితే ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లినట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: AP News: రేపు చంద్రగిరిలో ఒక ఎంపీపీ, రెండు ఉప సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ను దాదాపు రూ.13,500 కోట్లకు పైగా మోసం చేశారని 2018లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం చోక్సీ, నీరవ్ మోడీ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా-బార్బుడాకు పారిపోగా.. నీరవ్ మోడీ బ్రిటన్ పారిపోయాడు. వీరిని భారత్కు రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇటీవల ఇండియా పర్యటనకు వచ్చిన ఆంటిగ్వా-బార్బుడా విదేశాంగ మంత్రి ఈపీ ఛెత్ గ్రీన్ మాట్లాడుతూ.. మెహుల్ చోక్సీ ప్రస్తుతం తమ దేశంలో లేరని, వైద్యం కోసం విదేశాలకు వెళ్లినట్లు తెలిసిందన్నారు. చోక్సీ తమ దేశ పౌరుడేనని పేర్కొంటూ.. ఆయన్ను అప్పగించే విషయంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?