Bangladesh Protests: బంగ్లాదేశ్ అల్లర్లలో 105 మంది మృతి.. గాయపడిన 2500మంది..!
- బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న అల్లర్లు..
- విద్యార్థులు.. నిరుద్యోగుల ఆందోళనలతో దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు..
- ఈ అల్లర్లలో 105 మంది మృతి.. 2500 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh Protests: రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతుంది. స్టూడెంట్స్, నిరుద్యోగుల ఆందోళనలతో బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రధాని షేక్ హసీనా సర్కార్ దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది. విద్యార్థుల ఆందోళనలను అదుపు చేయడంలో పోలీసులు ఫెయిల్ కావడంతో రంగంలోకి మిలటరీని దించింది. కాగా, ఇప్పటి వరకు జరిగిన ఆందోళనల్లో 105 మంది చనిపోగా.. దాదాపు 2500 మంది గాయపడ్డారు. ఒక్క రాజధానిలో 52 మంది మృతి చెందాగా.. ఎక్కువ మరణాలకు పోలీసుల కాల్పులే కారణమని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
Read Also: Poha Health Benefits: అటుకులు తినడం వల్ల ఇన్ని లాభాలా..
Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
ఇక, దేశ రాజధాని ఢాకాలో ర్యాలీలు, ప్రదర్శనలు, ప్రజలు గుమికూడొద్దన్ని ప్రభుత్వం నిషేధించింది. ఈ సందర్భంగా ఇంటర్నెట్ను ఆపేసింది. ప్రభుత్వం ఎన్ని నిషేధాలు విధించినా తమ ఆందోళన కొనసాగుతుందని స్టూడెంట్స్ వెల్లడించారు. ఈ అల్లర్లలో చోటు చేసుకున్న మరణాలకు ప్రధాన మంత్రి షేక్ హసీనానే కారణం.. వెంటనే ఆమె తన పదవికి రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు నర్సింగ్డి జిల్లాలో నిరసనకారులు జైలులోకి దూసుకెళ్లి ఖైదీలను రిలీజ్ చేశారు. ఆ తర్వాత జైలుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనతో జైలు నుంచి వందలాది మంది ఖైదీలు పారిపోయినట్టు పోలీసులు వెల్లడించారు. స్టూడెంట్స్ ఆందోళనకారులపై దాడులు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.. ఇది ఆమోదయోగ్యం కాదని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ పేర్కొన్నారు.
Read Also: Telangana: దంచికొడుతున్న వానలు.. ఉప్పొంగుతున్న ప్రాజెక్టులు
కాగా, స్వతంత్ర దేశం కోసం పాకిస్థాన్తో 1971లో జరిగిన విముక్తి పోరులో పాల్గొన్న వారి పిల్లలు సహా కొన్ని నిర్దిష్ఠ సమూహాలకు సగానికిపైగా సివిల్ సర్వీస్ పోస్టుల్లో రిజర్వ్ చేసిన కోటా వ్యవస్థకు స్వస్తి పలకాలంటూ ఈ నెలలో విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. ప్రధాన మంత్రి హసీనాకు సపోర్ట్ ఇచ్చే ప్రభుత్వ అనుకూల గ్రూపుల పిల్లలే ఈ పథకం నుంచి లబ్ధి పొందుతున్నారన్న పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి.
BREAKING: Bangladesh has imposed a CURFEW and has deployed the ARMY to control ongoing protests against PM Hasina's authoritarian rule.
The death toll since Monday has climbed to at least 105.
Stay tuned.
pic.twitter.com/goHdtwAtcn— Steve Hanke (@steve_hanke) July 19, 2024
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!