Australia: ఇండియన్ వ్యక్తిపై రూ.5 కోట్ల రివార్డ్ ప్రకటించిన ఆస్ట్రేలియా.. ఎందుకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Australian police have offered a reward of Rs 5 crore for an Indian man in a beach murder case: భారతీయ వ్యక్తిపై ఆస్ట్రేలియన్ పోలీసులు ఏకంగా ఒక మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. భారతీయ కరెన్సీలో దాదాపుగా రూ.5 కోట్ల భారీ రివార్డు ఇది. నాలుగేళ్ల క్రితం 2018లో ఆస్ట్రేలియన్ బీచ్ లో ఓ హత్య చేసిన తర్వాత పారిపోయిన భారతీయ వ్యక్తి కోసం ఆస్ట్రేలియా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. దేశం వదిలి పారిపోయిన వ్యక్తి కోసం ఏకంగా భారీ నజరానాను ప్రకటించింది. వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్ ఇన్నిస్ఫైల్లో నర్సుగా పనిచేసిన రాజ్విందర్ సింగ్ (38) అక్టోబర్ 2018లో తోయా కార్డింగ్ లీ అనే మహిళను దారుణంగా చంపేశాడు. కైర్న్స్ లో హత్య జరిగింది. ఈ కేసులో రాజ్విందర్ సింగే కీలక నిందితుడని ఆస్ట్రేలియా పోలీసులు పేర్కొంటున్నారు.
Read Also: Apple: ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. అప్పటి నుంచి ఐ ఫోన్లలో 5జీ సేవలు
Also Read
- Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Strait of Hormuz: హోర్ముజ్పై ఇరాన్ కొత్త ప్లాన్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత రాజ్విందర్ సింగ్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం, భార్య, పిల్లలను వదిలి దేశం వదిలి పరారయ్యాడు. క్వీన్స్ లాండ్ పోలీసులు గత నాలుగేళ్లుగా రాజ్విందర్ సింగ్ కోసం గాలింపు చేపడుతున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు అతని ఆచూకీ లభించలేదు. ఈ రివార్డ్ క్వీన్స్ లాండ్ పోలీసుల చరిత్రలోనే అతిపెద్దది. హత్య తరువాత అక్టోబర్ 22న కైర్న్స్ నుంచి బయలుదేరి 23న సిడ్నీకి చేరుకున్న రాజ్విందర్ సింగ్ భారత్ పారిపోయాడని అక్కడి పోలీసులు ఆరోపిస్తున్నారు.
రాజ్విందర్ సింగ్ ప్రస్తుతం భారత్ లోనే ఉన్నాడని ఆస్ట్రేలియా పోలీసులు ధృవీకరించారు. కైర్న్స్ కేంద్రంగా దర్యాప్తు కేంద్రం ఏర్పడింది. ఈ కేసు కోసం హిందీ, పంజాబీ మాట్లాడే పోలీసుల అధికారులను నియమించారు. భారతదేశంలో ఉన్న సింగ్ ఆచూకీ గురించి వాట్సాప్ ద్వారా అధికారులకు తెలియజేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలుసని.. ఈ కేసులో సహకరించాలని కోరుతున్నామని మినిస్టర్ మార్క్ ర్యాన్ అన్నారు. రాజ్విందర్ సింగ్ను ట్రాక్ చేయడానికి ఈ భారీ రివార్డు సహకరిస్తుందని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యక్తిని పట్టుకునేందుకు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు ఈ రివార్డు కీలకం అని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు.
Anyone with information regarding the case or the whereabouts of Rajwinder Singh is urged to contact Queensland Police through the online portal (https://t.co/dWGfIYaKbX). In addition, anyone in Australia with information can call Crime Stoppers on 1800 333 000. pic.twitter.com/vd3e1W1SM7
— Queensland Police (@QldPolice) November 2, 2022
తాజావార్తలు
-
Fake Doctors: హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్ల అరెస్ట్..
-
YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
-
Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్
-
Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్డమ్కు కారణం!
-
Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!