Moon Mission: చంద్రుడిపైకి మరో దేశం.. మట్టి నుంచి ఆక్సిజన్ సేకరించే ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moon Mission: చంద్రుడిపై అన్ని దేశాలు తమ దృష్టిని సారిస్తున్నాయి. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహంపై భవిష్యత్తులో మానవ నివాసాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. రాబోయే అంతరిక్ష ప్రయోగాలకు చంద్రుడిని లాంచ్ ప్యాడ్ గా ఉపయోగించుకోవాలనే ఆలోచనల్లో పలు దేశాలు ఉన్నాయి. ఇప్పటికే చంద్రుడిపైకి ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమైంది. ఈ నేపథ్యంలో రాబోయే కాలంలో మరికొన్ని దేశాలు కూడా చంద్రుడిపైకి రోవర్లను పంపేందుకు సమాయత్తం అవుతున్నాయి.
ఆస్ట్రేలియా కూడా చందమామను అందుకోవాలని చూస్తోంది. అక్కడ మట్టి నుంచి ఆక్సిజన్ సేకరించాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. తన మొదటి మూన్ మిషన్, రోవర్ ని ఆస్ట్రేలియా ప్రకటించింది. 2026 నాటికి ఈ ప్రయోగం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మిషన్ కి, రోవర్ కి పేరు పెట్టలేదు. చంద్రుడిపై రెగోలిత్ మట్టి నుంచి ఆక్సిజన్ వెలికి తీయాలని ప్లాన్ చేస్తున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సహకారంతో ఆస్ట్రేలియా ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తోంది. ఆక్సిజన్ వెలికి తీయడం భవిష్యత్తులో చంద్రుడిపై మానవ ఆవాసాలకు ఎంతో కీలకం.
Also Read
- Instagram Addiction: టీనేజర్లను సోషల్ మీడియాకు బానిసలుగా మార్చేందుకే ఇన్స్టా..?.. మెటాపై తీవ్ర ఆరోపణలు
- Hantavirus: ప్రపంచాన్ని కలవరపెడుతున్న కొత్త వైరస్.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి!
- China Thanks India: చైనా నావికుల ప్రాణాలను కాపాడిన ఉపకారాన్ని ఎప్పటికీ మరచిపోలేం.. భారత సైన్యానికి చైనా కృతజ్ఞతలు
- Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
Read Also: Physical Harassment: పాక్లో 45 మంది మహిళా టీచర్లపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు
ఆస్ట్రేలియా రోవర్ ప్రయోగం, నాసా ఆర్టెమిస్ మిషన్ లో భాగంగా చంద్రుడిపైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియా చంద్రుడి పైకి పంపించే మొదటి రోవర్. కాగా.. ఈ రోవర్ కి ఆ దేశ స్పేస్ ఏజెన్సీ ఇంకా పేరు నిర్ణయించలేదు. దీనికి పేరును సూచించాలని అక్కడి ప్రజలకు పోటీ నిర్వహిస్తోంది. అక్టోబర్ 20 వరకు పేర్లు సూచించవచ్చు. నాలు పేర్లను షార్ట్ లిస్ట్ చేసి, విజేత పేరును డిసెంబర్ ప్రారంభంలో ప్రకటిస్తుంది.
నాసా నిర్వహిస్తున్న ఆర్టిమిస్ ప్రోగ్రాంతో ఇది ఈ ప్రయోగం కూడా ఉంటుంది. ఆర్టెమిస్ ద్వారా ఈ దశాబ్ధం చివరి నాటికి చంద్రుడిపై మానవ ఉనికిని స్థాపించాలని నాసా భావిస్తోంది. నాసా ఇప్పటికే ఆర్టిమెస్ 1 ప్రయోగాన్ని నిర్వహించింది. ఇందులో ఓరియన్ రాకెట్, చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి మళ్లీ తిరిగి భూమి మీదకు వచ్చింది. ఆర్టిమిస్-2 కోసం నాసా సిద్ధమవుతోంది. ఇందులో వ్యోమగాములను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లుతుంది. 2024 చివరి నాటికి ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఆర్టిమిస్-3 2025 లేదా 2026లో ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రయోగంలో చంద్రుడి దక్షిణ ధృవంపై వ్యోమగాములు దిగనున్నారు.
తాజావార్తలు
-
Bengaluru Crime: త్రిపుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. AI సాయంతో ముగ్గురిని లేపేశాడు!
-
Virat Kohli and Anushka Sharma: బురదలో చెప్పులు లేకుండా నడిచిన విరాట్, అనుష్క.. స్టార్ కపుల్ బృందావన్ వీడియో వైరల్..
-
IND vs ZIM: భారత్తో టీ20 సిరీస్.. జింబాబ్వే జట్టు ప్రకటన.. స్టార్లను కూడా వణికించే పేసర్కు చోటు!
-
Anantnag Terror Attack: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి.. కాల్పుల్లో హెడ్ కానిస్టేబుల్ మృతి
-
NEET Abolition: నీట్పై ‘దళపతి’ సంచలన డిమాండ్.. అసలు నీట్ పరీక్షను రాష్ట్రాలు రద్దు చేయగలవా?
ట్రెండింగ్
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!