Burkina Faso: బుర్కినా ఫాసోలో మళ్లీ చెలరేగిన హింస.. జిహాదీల ఊచకోతలో 200 మంది మృతి..!
- బుర్కినా ఫాసోలో మరోసారి చెలరేగిన హింస..
- సైనికులు
- గ్రామస్థుల మీద కాల్పులు జరిపిన జీహాదీలు..
- అల్ఖైదా ఉగ్రవాదుల కాల్పుల్లో దాదాపు 200 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Burkina Faso: వెస్ట్ ఆఫ్రికన్ దేశమైన బుర్కినా ఫాసోలో మరోసారి హింస చెలరేగిపోయింది. కయాకు ఉత్తరాన 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న బార్సలోగో ప్రాంతంలో శనివారం జరిగిన ఈ దారుణమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అల్-ఖైదాతో సంబంధం ఉన్న జమాత్ నుస్రత్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్ (JNIM) అనే జిహాదీలు జరిపిన తుపాకీ కాల్పుల్లో దాదాపు 200 మంది చనిపోగా.. మరో 140 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ ప్రాంతానికి చెందిన రీజినల్ స్పెషలిస్ట్ ఒకరు చెప్పుకొచ్చారు. మృతుల్లో గ్రామస్థులు, సైనికులు ఉన్నారని పేర్కొన్నారు. బర్సాలోగో దగ్గర శనివారం భద్రతా బలగాలు, గ్రామస్థులు కలిసి భద్రతా అవుట్పోస్టులను రక్షించడానికి కందకాలు తవ్వుతుండగా వారిపై జిహాదీలు కాల్పులకు దిగారు. ఈ దాడిలో అనేక మంది సైనికులు, ప్రజలు చనిపోయారని అల్ఖైదా ప్రకటించింది.
Read Also: WBBL 10: అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టులోకి భారత వైస్ కెప్టెన్ స్మృతి మందాన..
Also Read
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
- Sick Leave Denial Case: 'సిక్ లీవ్ కావాలి' అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
- Opendoor India Exit: భారత్కు గుడ్బై చెప్పిన ఓపెన్డోర్.. 250 మంది ఉద్యోగులకు షాక్
- Strait of Hormuz Closure: ఇరాన్ తీవ్ర హెచ్చరిక.. హార్మూజ్ గుండా వచ్చే నౌకలపై దాడులకు సిద్ధం.. చమురు సరఫరాకు ముప్పు
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను అల్ఖైదా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే, ఈ దాడి జరగబోతోందని బుర్కినా ఫాసో సైన్యానికి శుక్రవారం సమాచారం వచ్చింది.. కందకాలు తవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారని నికోలస్ హక్ అనే స్థానిక రిపోర్టర్ పేర్కొన్నాడు. ఈ దాడిలో గాయపడిన వారికి వైద్యులు, ఇతర వైద్య సిబ్బందిని కయా పట్టణం నుంచి పిలిపించారు. బుర్కినా ఫాసో దేశంలో సగానికిపైగా భూభాగం అక్కడి ప్రభుత్వ నియంత్రణలో లేకుండా పోయింది. అల్ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అక్కడి ప్రజలలో వేలాది మందిని చంపేశారు. ‘జిహాదీ గ్రూపుల దాడిలో సైనికులు, సామాన్య పౌరులు మరణించారని ఆ దేశ రక్షణ మంత్రి వెల్లడించారు.
తాజావార్తలు
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!