Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన
- దౌత్య సంబంధాలపై చర్చ
- పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ యూఏఈలో పర్యటించారు. పర్యటనలో భాగంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇంధన భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రాంతీయ స్థిరత్వంపై సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు.

Also Read
- Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
- China: గాల్వాన్ జనరల్పై జిన్పింగ్ వేటు.. భారత్కు ‘గుణపాఠం’ చెప్పాలనుకున్న ఆఫీసర్కు షాక్
- Russia-Ukraine: ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు.. 27 మంది మృతి.. 50 భవనాలు ధ్వంసం
- H-1B Visa Rules: H-1B ఉద్యోగులకు ట్రంప్ సర్కార్ షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ తొలగించే ప్రతిపాదనకు కీలక ఆమోదం
ఇటీవల సౌదీ అరేబియాలో కూడా అజిత్ దోవల్ పర్యటించారు. ఆ పర్యటన ముగిసిన వారం రోజులకే అబుదాబిలో యూఏఈ అధ్యక్షుడితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అజిత్ దోవల్ ఈ పర్యటన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గత రెండు నెలలుగా హార్ముజ్ జలసంధిని మూసేశారు. దీంతో ఇందన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కేవలం 10 నౌకలు మాత్రమే హార్ముజ్ను దాటాయి. భవిష్యత్ ప్రణాళికలో భాగంగా అజిత్ దోవల్ పర్యటన జరిగినట్లుగా తెలుస్తోంది.
‘‘ఆయన (అజిత్ దోవల్) రాష్ట్రపతి షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ను కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే చర్యలు. ప్రాంతీయ పరిస్థితి. పరస్పర ఆసక్తి ఉన్న ఇతర అంశాలపై చర్చించారు.’’ అని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా పోస్ట్లో తెలిపింది.
గత రెండు నెలల్లో ప్రధాని మోడీ- యూఏఈ, సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నాయకులతో దాదాపు రెండుసార్లు మాట్లాడారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఈ దేశాల్లోని తన సహచరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నెల ప్రారంభంలో తన రెండు దేశాల పర్యటన సందర్భంగా ఎస్. జైశంకర్ యూఏఈ అధ్యక్షుడిని కలిశారు. క్లిష్టమైన ప్రాంతీయ వాతావరణం ఉన్నప్పటికీ.. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు పటిష్టంగా, పారదర్శకంగా ఉన్నాయని పేర్కొంటూ, భారత్-యూఏఈ వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ప్రస్తుతం భద్రత, వ్యూహాత్మక అంశాలపై ఎమిరేట్స్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకునేందుకు అజిత్ దోవల్ కృషి చేస్తున్నందున.. ఆయన పర్యటన ఒక ముఖ్యమైన దౌత్యపరమైన చొరవగా తెలుస్తోంది.
NSA Ajit Doval paid an official visit to the UAE.
He called on President HH Sheikh @MohamedBinZayed. Conveyed greetings of PM @narendramodi . Measures to deepen Comprehensive Strategic Partnership, the regional situation, and other issues of mutual interest were discussed. pic.twitter.com/xFG6iRKqWJ— India in UAE (@IndembAbuDhabi) April 26, 2026
తాజావార్తలు
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
-
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!