Off The Record : కొండా సురేఖ సైలెంట్ ఎందుకు? అసెంబ్లీకి దూరం వెనుక అసలు వ్యూహమేంటి?
- కొండా సురేఖ రియాక్షన్స్పై రాజకీయవర్గాల ఆసక్తి
- అసెంబ్లీ సమావేశాలకు దూరంగా మాజీ మంత్రి
- నిరసన తెలపడంలో భాగమా అన్న చర్చలు
- తన మాజీ ఓఎస్డీని పోలీసులు వేధిస్తున్నారన్న ఫీలింగ్?
- కొండాతో మాట్లాడి కన్విన్స్ చేసేందుకు పీసీసీ చీఫ్ ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record : మాజీ మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం ఒక ఎత్తయితే…. ఆమె తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయోనంటూ ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు. తనను మంత్రివర్గం నుంచి తప్పించిన వెంటనే… పెద్దగా ఘాటు రియాక్షన్స్ ఏమీ లేకుండా సైలెంట్ అయ్యారామె. ఆలోచించి… భవిష్యత్ కార్యాచరణపై తగిన నిర్ణయం తీసుకుంటానని మాత్రం చెప్పారు. ఐతే.. ఇప్పటికిప్పుడు రాజకీయంగా గట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా..? అంటే, కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. మరోవైపు ఆమె మంత్రి వర్గం నుండి బర్తరఫ్ అయ్యాక… జరుగుతున్న తొలి అసెంబ్లీ సమావేశాలు ఇవే. మంత్రి పదవి లేకున్నా… ఎమ్మెల్యే హోదాలో సమావేశాలకు అటెండ్ కావచ్చు. కానీ…ఈ సెషన్ ప్రారంభమైనప్పటి నుంచి…అటువైపు వెళ్ళకుండా అసెంబ్లీకి దూరంగా ఉన్నారు కొండా సురేఖ.
సభ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళలేదామె. అలాగే సీఎల్పీ మీటింగ్కు కూడా దూరంగానే ఉన్నారు. దాంతో… ఇది నిరసన తెలిపే క్రమంలో భాగమా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. అదే సమయంలో నిన్నటిదాకా మంత్రి హోదాలో అటెండ్ అయిన చోటికి ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగా రావడానికి ఇబ్బంది పడుతున్నారా అన్న ప్రశ్నలు సైతం ఉన్నాయి. కారణం ఏదైనా… ఇప్పటికైతే సభకు దూరంగా ఉండాలనే నిర్ణయించుకున్నారట సురేఖ. తన మాజీ osd సుమంత్కి నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ… పోలీసులు వేధిస్తున్నారన్న ఫీలింగ్లో ఆమె ఉన్నట్టు సమాచారం. ఇదే విషయమై తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ కొండా సురేఖతో మాట్లాడి సుమంత్ ఎపిసోడ్పై వాకబు చేసినట్టు చెప్పుకుంటున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వమని కూడా సూచించారట. మరోవైపు ఇన్నాళ్ళు కొండా సురేఖ చూసిన శాఖలు.. సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలోకి వెళ్తాయి. మంత్రులకు కేటాయించని శాఖలు పూర్తిగా సీఎం పర్యవేక్షణలోకి వెళ్ళడం ప్రక్రియలో భాగమే. ఈ క్రమంలో రేపు విస్తరణ తర్వాత కొందరి పోర్ట్ఫోలియోలు మారే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
Also Read
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!