Maldives Fire Accident: మాల్దీవుల్లో భారీ అగ్ని ప్రమాదం.. 9 మంది భారతీయులు సహా 11 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాల్దీవుల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. మాలేలో విదేశీ కార్మికులు నివాసం ఉండే ఓ అపార్ట్మెంట్లో మంటలు చేలరేగి.. అపార్ట్మెంట్ మొత్తం వ్యాపించాయి.. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు.. మృతుల్లో తొమ్మిది మంది భారతీయులు ఉండడం కలచివేస్తోంది… తొమ్మిది మంది భారతీయులు, ఒకరు బంగ్లాదేశ్ జాతీయుడిగా గుర్తించారు మల్దీవుల అధికారులు.. ఇక, మాలేలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ విచారం వ్యక్తం చేసింది..
Read Also: Ganja Biscuits: గంజాయి బిస్కెట్ల కలకలం.. జైలులో ఉన్న అన్నకు పంపి జైలుపాలైన తమ్ముడు..
Also Read
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
మాల్దీవుల్లో దేశ రాజధాని మాలేలో విదేశీ కార్మికుల నివాసం ఉంటే ఇరుకైన భవనంలో మంటలు చెలరేగాయని చెబుతున్నారు.. మొత్తం 11 మంది మరణించారు మరియు పలువురు గాయపడినట్టు అగ్నిమాపక శాఖ తెలిపింది. మృతుల్లో తొమ్మిది మంది భారతీయులు, ఒక బంగ్లాదేశ్కు చెందిన వారు ఉన్నారని భద్రతా అధికారి తెలిపారు. మాలేలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై మాల్దీవుల్లోని భారత హైకమిషన్ విచారం వ్యక్తం చేస్తూ, ట్వీట్ చేసింది.. “మాలేలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో భారతీయ పౌరులు సహా ప్రాణనష్టం జరిగినందుకు మేము చాలా బాధపడుతున్నాం.. మేం వారి కుటుంబసభ్యులు, సన్నిహితులతో కమ్యూనికేషన్లో ఉన్నామని మాల్దీవుల అధికారులు తెలిపారు..
గ్రౌండ్ ఫ్లోర్ వెహికల్ రిపేర్ గ్యారేజీ నుంచి వచ్చిన మంటలు.. మొత్తం భవానికి వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది.. భవనం పై అంతస్తు నుంచి 10 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. “మేం 10 మృతదేహాలను కనుగొన్నాము,” అని అగ్నిమాపక సేవ అధికారి తెలిపారు, మంటలను ఆర్పడానికి తమకు నాలుగు గంటల సమయం పట్టిందని తెలిపారు. విదేశీ కార్మికుల పరిస్థితిని మాల్దీవుల రాజకీయ పార్టీలు విమర్శించాయి. మల్దీవుల జనాభాలో దాదాపు సగం మంది విదేశీయులే ఉన్నారు.. ఎక్కువగా బంగ్లాదేశ్, భారతదేశం, నేపాల్, పాకిస్తాన్ మరియు శ్రీలంకకు చెందినవారే ఉంటారు..
తాజావార్తలు
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!