Texas: టెక్సాస్ ఘటనలో 51 చేరిన మరణాలు.. విచారణకు జోబైడెన్ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. అమెరికాకు కంటైనర్ ట్రక్ లో వలస వస్తున్న వారు కంటైనర్ లోనే మరణించారు. ఊపిరి ఆడకపోవడం, విపరీతమైన వేడి కారణంగా అందులోనే చనిపోయారు. ఈ ఘటనలో మరణాల సంఖ్య 51కి చేరింది. టెక్సాస్ లోని శాన్ ఆంటోనియోలో మంగళవారం రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్ కంటైనర్ లో పెద్ద సంఖ్యలో శవాలను కనుక్కున్నారు. మరణించిన వారిలో 39 మంది పురుషులు ఉండగా..12 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం మరో 16 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు.
ఈ ఘటనపై అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హ్యుమన్ స్మగ్లింగ్ ముఠాల వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఘటనపై డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీని విచారణకు ఆదేశించారు. ఈ ఘటన బిలియన్ డాలర్ల హ్యూమన్ స్మగ్లింగ్ పై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనను విచారిస్తున్న అధికారులు ట్రక్ రిజిస్ట్రేషన్ ఆధారంగా ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. వీరిద్దరు మెక్సికన్ జాతీయులుగా గుర్తించారు. ట్రక్ డ్రైవర్ ని అరెస్ట్ చేశారు.
Also Read
- Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
మెక్సికో, ఇతర లాటిన్ అమెరికా దేశాల నుంచి ఏటా కొన్ని వేల మంది యూఎస్ కు అక్రమంగా ప్రవేశిస్తుంటారు. తాజాగా జరిగిన ఘటన కూడా వలస వచ్చే క్రమంలోనే జరిగినట్లు తెలుస్తోంది. మెక్సికన్ ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యయెల్ లోపేజ్ ఒబ్రాడర్ మాట్లాడుతూ.. చనిపోయిన వారిలో 22 మంది మెక్సికోకు, ఏడుగురు గ్వాటెమాల, ఇద్దరు హోండూరస్ కు చెందిన వారని చెప్పారు.
తాజావార్తలు
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
CJP Protest: వెనక్కి తగ్గని CJP.. ఉద్యమం కొనసాగుతుందని ప్రకటన..
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Sachin Tendulkar: “ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
ట్రెండింగ్
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!