Nobel Peace Prize: జైలులో ఉండి నోబెల్ శాంతి బహుమతి పొందింది వీరే.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nobel Peace Prize: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్కి చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గేస్ మొహమ్మదీ గెలుచుకున్నారు.అయితే ఆమె ప్రస్తుతం టెహ్రాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. దాదాపుగా 30కి పైగా కేసులను అక్కడి మత ఛాందసవాద ప్రభుత్వం ఆమెపై మోపింది. నర్గీస్ ఒక్కరే కాదు, ఈమెతో కలిపి ఐదుగురు జైలులో ఉన్న సమయంలోనే వారికి నోబెల్ శాంతి బహుమతులు వచ్చాయి.
నర్గీస్ మొహమ్మదీ (2023):
Also Read
- Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
- Pakistan: ‘‘ఇస్లామిక్ నాటో’’లో చేరండి.. ముస్లిం దేశాలకు పాకిస్తాన్ పిలుపు..
- Solar Eclipse 2026: రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. ఎక్కడ కనిపిస్తుంది..? భారత్లో పరిస్థితి ఏంటి..? పూర్తి వివరాలు
- Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
ఇరాన్ మానవ హక్కుల కార్యకర్త అయిన నర్గీస్ మొహమ్మదీ మహిళలపై అణిచివేతను ప్రశ్నించింది. జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పోరాడారు. హిజాబ్, మరణశిక్షలకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయితే ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని నర్గీస్ ని అక్కడి ప్రభుత్వం జైలులో నిర్భంధించింది. ప్రస్తుతం ఆమె 30కి పైగా కేసులు, కొరడా దెబ్బల శిక్షలను అనుభవిస్తున్నారు. గతేడాది ఇరాన్ మహిళ మహ్సా అమిని హత్యకు నిరసనగా జైలు నుంచే ఆమె పోరాటం కొనసాగించారు.
కార్ల్ వాన్ ఒసిట్జ్కీ, జర్మనీ(1935):
జర్నలిస్ట్, శాంతికాముకుడైన కార్ల్ వాన్ ఒస్సిట్జ్కీ 1935లో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నారు. హిట్లర్ సమయంలో నాజీ నిర్బంధ శిబిరంలో ఖైదీగా ఉన్నాడు. హిట్లర్ అన్యాయాలను ప్రశ్నించాడు. జర్మనీ పౌరులెవరూ కూడా ఏ విభాగంలో నోబెల్ బహుమతి స్వీకరించకుండా నిషేధించారు. ఒస్సిట్జ్కీ 1938లో జైలులోనే మరణించారు.
ఆంగ్ సాన్ సూకీ, మయన్మార్(1991):
మయన్మార్ ప్రధానిగా పనిచేసి ఆంగ్ సాంగ్ సూకీ 1991లో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. ఆ సమయంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన ఆమెను అక్కడి మిలిటరీ గృహనిర్భంధంలో ఉంచింది. ఈ అవార్డును సూకీ భర్త, కుమారులు తీసుకున్నారు. ప్రజాస్వామ్యం, మానవహక్కుల కోసం ఆమె అహింసాయుత పోరాటం చేశారు. ఆ సమయంలో మయన్మార్ విడిచి అవార్డు తీసుకోవడానికి ఓస్లోకి వెళితే మళ్లీ తిరిగి రానివ్వరని భయపడ్డారు.
ఫిబ్రవరి 2021లో సూకీ ప్రభుత్వాన్ని పదవి నుంచి దించేసి మరోసారి మిలిటరీ జుంటా మయన్మార్ పాలనను హస్తగతం చేసుకుంది. 2022లో ఆమెకు మొత్తం 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది అక్కడి జుంటా ప్రభుత్వం. ఆ తరువాత జుంటా చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్ పాక్షికంగా శిక్షను తగ్గించాడు.
లియు జియాబో, చైనా(2010):
చైనా అసమ్మతవాది లియు జియాబో 2010లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. ఆ సమయంలో ఆయన జైలులో ఉన్నారు. విద్రోహానికి పాల్పడిన ఆరోపణలపై అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆయనకు 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. చైనాలో మానవహక్కుల కోసం సుదీర్ఘంగా పోరాడారు. ఈ బహుమతి గెలుచుకున్న తర్వాత లియు భార్యన లియు జియాను కూడా గృహనిర్భందంలోకి తీసుకున్నారు. అతని ముగ్గురు కుమారులు చైనా వదిలివెళ్లకుండా నిర్భందించారు. 2017 క్యాన్సర్ తోఆయన కన్నుమూశారు. జైలులోనే కన్నుమూసిన రెండో నోబెల్ గ్రహీత అయ్యారు.
అలెస్ బిలియాట్స్కీ, బెలారస్(2022):
బెలారస్ దేశానికి చెందిన మానవహక్కుల ప్రచారకర్త అలెస్ బిలియాట్స్కీకి అక్కడి ప్రభుత్వం 2021లో జైలు శిక్ష విధించింది. శాంతి బహుమతి వచ్చే సమయానికి ఆయన జైలులోనే ఉన్నారు. యుద్ధనేరాలు, హక్కుల దుర్వినియోగంపై చేసిన కృషికి గానూ ఆయనకు అవార్డు వచ్చింది. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో పాలనపై నిరసన వ్యక్తం చేశాడు.
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..