Nobel Peace Prize: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని ఇరాన్కి చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గేస్ మొహమ్మదీ గెలుచుకున్నారు.అయితే ఆమె ప్రస్తుతం టెహ్రాన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. దాదాపుగా 30కి పైగా కేసులను అక్కడి మత ఛాందసవాద ప్రభుత్వం ఆమెపై మోపింది. నర్గీస్ ఒక్కరే కాదు, ఈమెతో కలిపి ఐదుగురు జైలులో ఉన్న సమయంలోనే వారికి నోబెల్ శాంతి బహుమతులు వచ్చాయి.
Nobel Peace Prize: ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఇరాన్ మానవహక్కుల కార్యకర్త నర్గేస్ మొహమ్మదీకి నోబెల్ శాంతి బహుమతి లభించింది. తన దేశంలో మహిళలపై జరుగుతున్న అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె పోరాడారు. ప్రస్తుతం ఆమె జైలులో ఉన్నారు. మహిళా హక్కుల కోసం నినదించిన నర్గేస్ మొహమ్మదీకి 2023 సంవత్సరానికి గానూ శాంతి బహుమతి ఇచ్చారు.