Israel: ఇజ్రాయిల్లో 40 మంది.. పాలస్తీనాలో 161 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: పాలస్తీనా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై మెరుపుదాడి చేశారు. కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లతో ఇజ్రాయిల్ భూభాగాలపై దాడులు నిర్వహించారు. సరిహద్దుల్లోనే పట్టణాలను టార్గెట్ చేస్తూ దాడులు జరిగాయి. గాజా నుంచి ఇజ్రాయిల్ భూభాగాల్లోకి చొరబడిన హమాస్ మిలిటెంట్లు సాధారణ పౌరులను పిట్టల్లా కాల్చారు.
ఇప్పటి వరకు ఈ దాడుల్లో 40 మంది మరణించగా.. 500 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ రెస్క్యూ సర్వీస్ తెలిపింది. హమాస్ ఉగ్రవాదులు ‘‘ ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్’’పేరుతో ఆపరేషన్ నిర్వహించినట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే దీని ప్రతిగా ఇజ్రాయిల్ ‘ఆపరేషన్ ఐరన్ స్వార్డ్’ పేరుతో హమాస్ ని టార్గెట్ చేస్తోంది. గాజాలోని మిలిటెంట్ల స్థావరాలు, వారికి సహకరిస్తున్న వారిపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. పాలస్తీనాలో 161 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ తెలిపింది.
Also Read
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
Read Also: GST: చెక్కర రైతులకు తీపి కబురు చెప్పిన నిర్మలా సీతారామన్.. వీటిపై జీఎస్టీ తగ్గింపు..
ఇది ఆపరేషన్ కాదని, తాము యుద్ధంలో ఉన్నామని ఇజ్రాయిల్ ప్రజలను ఉద్దేశించి ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ అన్నారు. ఈ యుద్ధంతో ఇజ్రాయిల్ గెలుస్తుందని, హమాస్ తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు హమాస్ తీవ్రవాద నాయకుడు మహ్మద్ దీఫ్ ఓ వీడియోలో మాట్లాడుతూ.. జవాబుదారీతనం లేని నిర్లక్ష్యపు కాలం ముగిసిపోయిందని శత్రువులు అర్థం చేసుకునేలా భగవంతుడి సాయంతో వీటిన్నింటికి ముగింపు పలకాలని అన్నాడు.
2007లో గాజాలో హమాస్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య అనేక దాడులు జరిగాయి. ఇజ్రాయిల్ గజాన్ వర్కర్లకు సరిహద్దును మూసేసిన తర్వాత ఇరు పక్షాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన ఘర్షణల్లో 247 మంది పాలస్తీనియన్లు, 32 మంది ఇజ్రాయిలీలు, ఇద్దరు విదేశీ వ్యక్తులు మరణించారు. తాజా దాడిలో గాజా స్ట్రిప్, ఇజ్రాయిల్ సరిహద్దుల్లోని పట్టణాలు, నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
-
Peddi Controversy : ‘పెద్ది’ ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్… ఏమన్నారంటే?
-
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆకస్మిక ధన లాభాలు.!
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 వచ్చేస్తోంది.. 7560mAh బ్యాటరీ, మీడియాటెక్ ప్రాసెసర్, డ్యూయల్ కెమెరా
-
Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!