Nigeria wedding: పెళ్లిలో విషాదం.. ఆత్మాహుతి దాడిలో 32 మంది దుర్మరణం
- నైజీరియాలో మహిళా ఆత్మాహుతి బాంబర్లు బీభత్సం
- పెళ్లిలో విషాదం.. ఆత్మాహుతి దాడి.. 32 మంది దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నైజీరియాలో మహిళా ఆత్మాహుతి బాంబర్లు బీభత్సం సృష్టించారు. పెళ్లి, అంత్యక్రియలు, ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. దీంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య నైజీరియా పట్టణంలోని గ్వోజాలో వారాంతంలో జరిగిన పలు ఆత్మాహుతి బాంబు దాడుల్లో మరణించిన వారి సంఖ్య 32కి చేరిందని, 42 మంది గాయపడినట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు కాశీం శెట్టిమా సోమవారం తెలిపారు. షెట్టిమా బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలోని ఆసుపత్రిని సందర్శించారు. కొంతమంది గాయపడినవారు చికిత్స పొందుతున్నారు. ఇక పేలుళ్లకు బాధ్యులుగా ఎవరు ప్రకటించలేదు. అయితే గ్వోజా చుట్టూ బోకో హరామ్ జిహాదిస్ట్ గ్రూప్ చురుకుగా ఉన్నట్లుగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tragedy: విషాదం.. చెరువులో మునిగి తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు మృతి
Also Read
- PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Kim Jong Un: కిమ్ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
2009లో ఆత్మాహుతి దాడుల్లో 40,000 మందికి పైగా మరణించారు. మరో రెండు మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 2014లో సైన్యం.. మిలిటెంట్లను నిర్మూలించారు. దీంతో అరుదుగా జరుగుతున్నాయి. తాజాగా ఇటీవల మళ్లీ చోటుచేసుకుంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఆకస్మిక దాడులను నిర్వహిస్తున్నారు. ఈ సంఘటన చాలా దిగ్భ్రాంతికరమైనదని పాలక APC పార్టీకి చెందిన బోర్నో సెనేటర్ మహమ్మద్ అలీ న్డుమే విలేకరులతో అన్నారు.
ఇది కూడా చదవండి: Pani puri: ‘పానీ పూరి’ శాంపిళ్లలో క్యాన్సర్ ఏజెంట్స్.. ప్రభుత్వం చర్యలు..
ఒక వివాహ వేడుకలో మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో ఆత్మాహుతి బాంబర్ అతిథుల మధ్య పేలుడు పదార్థాలను అమర్చినప్పుడు మొదటి దాడి జరిగిందని అధికారులు తెలిపారు. వివాహ దాడిలో బాధితుల కోసం అంత్యక్రియల ప్రార్థనలు జరుగుతుండగా మరొక మహిళా ఆత్మాహుతి బాంబర్ పేల్చిందని స్థానిక అత్యవసర సేవల అధిపతి బార్కిండో సైదు తెలిపారు. కొన్ని నిమిషాల తర్వాత నగరంలోని జనరల్ హాస్పిటల్ సమీపంలో ఒక టీనేజ్ అమ్మాయి మరొక పరికరాన్ని పేల్చివేసిందని పేర్కొన్నారు. నాల్గవ ఆత్మాహుతి దాడి సెక్యూరిటీ పోస్ట్ను లక్ష్యంగా చేసుకుని ఒక సైనికుడితో సహా ముగ్గురిని చంపారు.
ఇది కూడా చదవండి: Lufthansa plane: లుఫ్తాన్స్ విమాన చక్రంలో మంటలు.. ఢిల్లీలో సేఫ్గా ల్యాండ్
తాజావార్తలు
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!