Nigeria wedding: పెళ్లిలో విషాదం.. ఆత్మాహుతి దాడిలో 32 మంది దుర్మరణం
- నైజీరియాలో మహిళా ఆత్మాహుతి బాంబర్లు బీభత్సం
- పెళ్లిలో విషాదం.. ఆత్మాహుతి దాడి.. 32 మంది దుర్మరణం
నైజీరియాలో మహిళా ఆత్మాహుతి బాంబర్లు బీభత్సం సృష్టించారు. పెళ్లి, అంత్యక్రియలు, ఆస్పత్రిని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడ్డారు. దీంతో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈశాన్య నైజీరియా పట్టణంలోని గ్వోజాలో వారాంతంలో జరిగిన పలు ఆత్మాహుతి బాంబు దాడుల్లో మరణించిన వారి సంఖ్య 32కి చేరిందని, 42 మంది గాయపడినట్లు ఆ దేశ ఉపాధ్యక్షుడు కాశీం శెట్టిమా సోమవారం తెలిపారు. షెట్టిమా బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురిలోని ఆసుపత్రిని సందర్శించారు. కొంతమంది గాయపడినవారు చికిత్స పొందుతున్నారు. ఇక పేలుళ్లకు బాధ్యులుగా ఎవరు ప్రకటించలేదు. అయితే గ్వోజా చుట్టూ బోకో హరామ్ జిహాదిస్ట్ గ్రూప్ చురుకుగా ఉన్నట్లుగా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Tragedy: విషాదం.. చెరువులో మునిగి తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు మృతి
Also Read
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
- Trump-King Charles: వైట్హౌస్లో ట్రంప్ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
2009లో ఆత్మాహుతి దాడుల్లో 40,000 మందికి పైగా మరణించారు. మరో రెండు మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. 2014లో సైన్యం.. మిలిటెంట్లను నిర్మూలించారు. దీంతో అరుదుగా జరుగుతున్నాయి. తాజాగా ఇటీవల మళ్లీ చోటుచేసుకుంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఆకస్మిక దాడులను నిర్వహిస్తున్నారు. ఈ సంఘటన చాలా దిగ్భ్రాంతికరమైనదని పాలక APC పార్టీకి చెందిన బోర్నో సెనేటర్ మహమ్మద్ అలీ న్డుమే విలేకరులతో అన్నారు.
ఇది కూడా చదవండి: Pani puri: ‘పానీ పూరి’ శాంపిళ్లలో క్యాన్సర్ ఏజెంట్స్.. ప్రభుత్వం చర్యలు..
ఒక వివాహ వేడుకలో మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో ఆత్మాహుతి బాంబర్ అతిథుల మధ్య పేలుడు పదార్థాలను అమర్చినప్పుడు మొదటి దాడి జరిగిందని అధికారులు తెలిపారు. వివాహ దాడిలో బాధితుల కోసం అంత్యక్రియల ప్రార్థనలు జరుగుతుండగా మరొక మహిళా ఆత్మాహుతి బాంబర్ పేల్చిందని స్థానిక అత్యవసర సేవల అధిపతి బార్కిండో సైదు తెలిపారు. కొన్ని నిమిషాల తర్వాత నగరంలోని జనరల్ హాస్పిటల్ సమీపంలో ఒక టీనేజ్ అమ్మాయి మరొక పరికరాన్ని పేల్చివేసిందని పేర్కొన్నారు. నాల్గవ ఆత్మాహుతి దాడి సెక్యూరిటీ పోస్ట్ను లక్ష్యంగా చేసుకుని ఒక సైనికుడితో సహా ముగ్గురిని చంపారు.
ఇది కూడా చదవండి: Lufthansa plane: లుఫ్తాన్స్ విమాన చక్రంలో మంటలు.. ఢిల్లీలో సేఫ్గా ల్యాండ్
తాజావార్తలు
-
Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!