Israel-Hamas War: వెస్ట్ బ్యాంక్ శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ దాడి.. 14 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Hamas War: ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధం ప్రారంభమై నెల దాటుతున్నా.. ఇప్పటికి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా వేలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. కాగా తాజాగా గురువారం వెస్ట్ బ్యాంక్ లోని జెనిన్ శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ సైనికులు దాడి చేశారు. ఈ దాడులు 12 గంటలకు పైగా కొనసాగినట్లు సమాచారం. కాగా ఈ దాడిలో 14 మంది మరణించారు. ఈ విషయాన్ని గాజాకు చెందిన పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే మరణించింది పౌరుల లేక ఉగ్రవాదుల అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) మాట్లాడుతూ.. ఆగస్ట్ 31 జరిగిన ర్యామ్మింగ్ దాడిలో ఆఫ్ డ్యూటీ ఇజ్రాయెల్ సైనికుడిని చంపేశారని.. ఆ సైనికుడిని చంపిన వ్యక్తి ఇంటిని కూల్చేందుకు అలానే ఉగ్రవాద అవస్థాపనను అడ్డుకోవడానికి ఈ ఆపరేషన్ నిర్వహించామని పేర్కొన్నారు.
Read also:TTD: హాట్ కేకుల్లా వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విక్రయం.. నిమిషాల వ్యవధిలోనే పూర్తి
Also Read
- China-Pakistan: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కు చైనా ప్రత్యక్ష సహాయం..!
- Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
- China: జిన్పింగ్ పీఠానికే ఎసరు? చైనా మాజీ రక్షణ మంత్రుల మరణశిక్ష వెనుక 'అసలు' మిస్టరీ ఇదేనా!
- Bangladesh: ‘‘మమతా బెనర్జీ వెంట 17 కోట్ల మంది ముస్లింలు’’.. బంగ్లాదేశ్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..
కాగా మక్కాబిమ్ చెక్పాయింట్, హష్మోనైమ్ చెక్పాయింట్ వద్ద తొక్కిసలాట దాడికి పాల్పడిన ఉగ్రవాది ఇంటిని కూల్చివేసే ఉత్తర్వుపై సెంట్రల్ కమాండ్ కమాండర్ సంతకం చేశారు అని.. అలానే జెనిన్ శరణార్థి శిబిరంలో తమ బలగాలకు హాని కలిగించే ఉద్దేశంతో ఇంజనీరింగ్ దళాలు పేలుడు పరికరాలను ఉపయోగించేందుకు చూశాయని ఈ నేపధ్యంలో ఈ ఆపరేషన్ నిర్వహించామని మిలటరీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా అనిన్ (జెనిన్), బెత్లెహెం నగరం, బలాటా శరణార్థి శిబిరం (నాబ్లస్), అల్ అమారీ శరణార్థి శిబిరాల పైన గురువారం జరిగిన ఘర్షణల్లో మరో ఐదుగురు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!