India Billionaires 2025: వామ్మో.. భారత్లో 350 మందికి పైగా బిలియనీర్లు.. వీళ్ల సంపాదన GDPలో దాదాపు సగం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Billionaires 2025: భారతదేశం బిలియనీర్లకు కొత్త కేంద్రంగా మారుతోంది. దేశంలో సంపన్న వ్యక్తుల సంఖ్య ఏడాది నుంచి వేగంగా పెరుగుతోంది. తాజాగా M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 విడుదలైంది. ఈ లిస్ట్ ప్రకారం.. భారతీయ బిలియనీర్ల సంఖ్య 350 కంటే ఎక్కువకు పెరిగింది. ఈ సంఖ్య గత 13 సంవత్సరాలలో ఆరు రెట్లు పెరిగింది. ముఖేష్ అంబానీ మరోసారి అత్యంత ధనవంతుల ర్యాంకింగ్లో ఆధిపత్యం చెలాయించారు. నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ మొదటిసారి బిలియనీర్స్ క్లబ్లో చేరారు. కాగా.. M3M హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 లో చేర్చబడిన బిలియనీర్ల మొత్తం సంపద ₹167 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)లో దాదాపు సగం.
READ MORE: Yashashree Rao: తెలుగులో హీరోయిన్గా మరాఠీ సోషల్ మీడియా భామ!
Also Read
- Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
- Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Union Budget 2026: భారత్ ఎంత అప్పు చేయనుందో తెలుసా? రుణాలపై మంత్రి కీలక ప్రకటన..
- Budget 2026: కొత్త పన్ను, కస్టమ్స్ రేట్లు తగ్గింపు, టీడీఎస్ సరళీకరణ.. బడ్జెట్లో కీలక మార్పులు
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబం నికర విలువ ₹9.55 లక్షల కోట్లుగా అంచనా వేశారు. గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం ₹8.15 లక్షల కోట్ల నికర విలువతో రెండవ స్థానంలో ఉన్నారు. ₹2.84 లక్షల కోట్ల నికర విలువతో రోష్ని నాడర్ మల్హోత్రా ఈ జాబితాలో మూడవ స్థానంలో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో ఆమె అత్యున్నత ర్యాంక్ పొందిన మహిళా బిలియనీర్ అయ్యారు. 2025 ధనవంతుల జాబితాలో పెర్ప్లెక్సిటీ వ్యవస్థాపకుడు, 31 ఏళ్ల అరవింద్ శ్రీనివాస్ ₹21,190 కోట్ల నికర విలువతో భారత్లోనే అతి పిన్న వయస్కుడైన బిలియనీర్ అయ్యారు. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ తొలిసారిగా జాబితాలో కనిపించారు. ₹12,490 కోట్ల నికర విలువతో అగ్రశ్రేణి బిలియనీర్ల క్లబ్లో చేరారు. అత్యధికంగా సంపద పెరిగిన బిలియనీర్ నీరజ్ బజాజ్, ఆయన కుటుంబం, రూ. 69,875 కోట్ల పెరుగుదలతో వారి నికర విలువ ఇప్పుడు రూ. 2.33 లక్షల కోట్లకు చేరుకుంది. ముంబై సంపన్నుల కేంద్రంగా కొనసాగుతోంది.
తాజావార్తలు
-
PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన ‘పెద్ది’
-
East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
-
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
-
Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..