Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- నేటి నుంచి బంగారం, వెండిపై మొత్తం దిగుమతి సుంకం 15%కి పెంపు
- బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 5% నుంచి 10%కి పెరిగింది
- అదనంగా 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ కొనసాగింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Hikes Gold and Silver Import Duty Charges increased: భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం కాదు.. అది భద్రత, పెట్టుబడి, సంప్రదాయం. అలాంటి బంగారం, వెండిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ పన్ను భారం మోపింది. నేటి (మే 13) నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిర్ణయంతో బంగారం, వెండిపై మొత్తం దిగుమతి సుంకం 15% కి పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో పసిడి ధరలు మరింత ఎగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
2024లో బడ్జెట్ సమయంలో స్మగ్లింగ్ను తగ్గించడం, జ్యువెలరీ రంగానికి ఊతమివ్వడం లక్ష్యంగా కేంద్రం దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6%కి తగ్గించింది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెరుగుతున్న చమురు ధరలు, రూపాయి పతనం, భారీ బంగారం దిగుమతులు కలిసి భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాయి. దీంతో ప్రభుత్వం మళ్లీ పాత పన్ను విధానానికే తిరిగి వెల్లాసి వచ్చింది.
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
తాజా నోటిఫికేషన్ ప్రకారం.. బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 5% నుంచి 10% కి పెంచారు. దీనికి అదనంగా 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ కొనసాగుతుంది. అంటే విదేశాల నుంచి దిగుమతి అయ్యే బంగారం, వెండిపై మొత్తం పన్ను భారం ఇప్పుడు 15% కి చేరింది. ప్లాటినం, జ్యువెలరీ తయారీలో ఉపయోగించే విడిభాగాలు, రీసైక్లింగ్కు వచ్చే విలువైన లోహాల వ్యర్థాలపైనా సుంకాలు పెరిగాయి.
మరోవైపు బంగారం దిగుమతులు పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ కూడా రికార్డు స్థాయిలో పడిపోయింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఖర్చులను నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా అవసరం లేని బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలని ప్రజలకు పిలుపునివ్వడం దీనికే సంకేతంగా భావిస్తున్నారు.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!