Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhatrapati Sambhaji Maharaj Jayanti 2026: భారతీయ చరిత్రలో ధైర్యసాహసాలకు, అజేయమైన సంకల్పానికి మారుపేరు ఛత్రపతి శంభాజీ మహారాజ్. నేడు ఆ మహనీయుడి జయంతి. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జ్యేష్ఠ పుత్రుడైన శంభాజీ, మే 14, 1657న పురందర్ కోటలో శివాజీ, సాయిబాయి దంపతులకు జన్మించారు. దురదృష్టవశాత్తూ ఆయనకు రెండు ఏళ్ల వయసున్నప్పుడే తల్లి మరణించడంతో, తండ్రి శివాజీకి మార్గదర్శిగా నిలిచిన రాజమాత జిజాబాయి పర్యవేక్షణలోనే శంభాజీ పెరిగారు. పిలాజీ షిర్కే కుమార్తె జీవూబాయిని వివాహం చేసుకున్నారు.
1681లో సింహాసనాన్ని అధిష్టించిన శంభాజీ, తన తండ్రి ఆశయమైన ‘హిందవీ స్వరాజ్యాన్ని’ కాపాడటంలో ప్రాణాలకు తెగించి పోరాడారు. కేవలం యుద్ధ వీరుడిగానే కాకుండా, అనేక భాషల్లో ప్రావీణ్యం ఉన్న గొప్ప పండితుడిగా ఆయనకు పేరుంది. 1681 నుంచి 1689 వరకు సాగిన శంభాజీ పాలనలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు దక్కన్ ప్రాంతాన్ని ఆక్రమించకుండా అడ్డుకోవడంలో శంభాజీ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా మొఘలుల కీలక నగరం బుర్హాన్పూర్పై ఆయన జరిపిన దాడి వారిని వణికించింది. సొంత కోటలోనే కొందరు శంభాజీ ప్రాణాలు తీయాలని కుట్రలు పన్నినప్పటికీ, వాటన్నింటినీ ఎదుర్కొని సామ్రాజ్యాన్ని విస్తరించారు.
Also Read
- Friendship Day 2026: ఒక బ్యాండ్.. ఎన్నో జ్ఞాపకాలు.. అసలు స్నేహితుల దినోత్సవం చరిత్ర తెలుసా?
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- Harappa Facts: 'ఆ ముద్రపై కనిపిస్తున్న వ్యక్తి శివుడు కాదు..?' అమెరికన్ చరిత్రకారిణి వ్యాఖ్యలతో రాజుకున్న వివాదం!
- History: పూర్వం ఏసీలు, కూలర్లు లేవు కదా? మరి అంత ఎండలో రాజులు, చక్రవర్తులు ఎలా బ్రతికారు?
అయితే 1689లో శంభాజీని ఔరంగజేబు బందీగా పట్టుకున్నాడు. ఇస్లాంలోకి మారాలని చిత్రహింసలు పెట్టారు. కొన్ని రోజుల పాటు ఆయన్ని తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసినా, శంభాజీ తన విశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు. చివరకు మార్చి 11, 1689న ఆయనను మొఘలులు అత్యంత కిరాతకంగా చంపారు. మరణం కళ్లముందు కనిపిస్తున్నా ఆయన చూపిన ధైర్యం దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. శంభాజీ మహారాజ్ జీవితం పిల్లలకు ఎంతో స్ఫూర్తిదాయకం. క్రమశిక్షణ, దేశభక్తి, విద్యా ప్రాధాన్యత, కష్టకాలంలో నిలబడే మనస్తత్వాన్ని ఆయన జీవితం నేర్పిస్తుంది. ప్రస్తుతం శంభాజీ వీరగాథను నేటి తరానికి పరిచయం చేస్తూ బాలీవుడ్లో ‘ఛావా’ (Chhava) అనే సినిమా రూపొందింది. మరాఠీలో ‘ఛావా’ అంటే ‘సింహం పిల్ల’ అని అర్థం. ఇందులో విక్కీ కౌశల్ శంభాజీ పాత్రను పోషించగా.. రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, దివ్య దత్తా, డయానా పెంటీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. మరాఠా సామ్రాజ్య వైభవాన్ని, శంభాజీ త్యాగాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. నేడు శంభాజీ జయంతి (మే 14) సందర్భంగా ఆయన చూపిన పట్టుదల, ధైర్యం ప్రతి భారతీయుడి గుండెల్లో స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!