POWERGRID RECRUITMENT : పవర్ గ్రిడ్ లో ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ప్రముఖ పవర్ కార్పొరేషన్ సంస్థ పవర్ గ్రిడ్ లో భారీగా ఉద్యోగాలకు దరఖాస్తులను కోరుతుంది.. ఈ మేరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. దేశవ్యాప్తంగా ఉన్న పీజీసీఐఎల్ కార్యాలయాల్లో ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీ చేపట్టనుంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 425 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు..
ఈ ఉద్యోగాలకు దరఖాస్తుచేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, బీటెక్, బీఎస్సీతో పాటు గేట్-2024 పరీక్షకు హాజరవుతున్నవారు అర్హులు.. 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్, బీఎస్సీ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ (పవర్), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్, పవర్ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్), ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్,కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. అంతేకాదు గేట్ 2024 లో మంచి స్కోర్ చేసి ఉండాలని తెలిపారు..
Also Read
- మల్లారెడ్డి గ్రూప్-గూగుల్ భాగస్వామ్యంలో 'Digital Campus on Google Cloud' ప్రారంభం..!
- Arunachal Pradesh: రాత్రిపూట 65 కిలోమీటర్లు నడిచిన 90 మంది బాలికలు.. ఎందుకో తెలుసా...
- South Asian University: విద్యార్థులకు సపోర్ట్ చేశారని.. ప్రొఫెసర్ ను తొలగించిన వర్సిటీ
- Lizard astrology meaning Vastu lizard symbolism: ఇంట్లో బల్లి ఉంటే శుభ సూచకమా.. ఆ శుభ సూచకమా.. ?
వయస్సు..
అభ్యర్ధుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి..
ఎంపిక ప్రక్రియ..
గేట్ 2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏడాది శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో నెలకు రూ.40,000 స్టైపెండ్ అందజేస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఇంజినీర్ ఈ-2 హోదాలో పీజీసీఐఎల్ పరిధిలోని నార్తర్న్, ఈస్ట్రన్, నార్త్- ఈస్ట్రన్, సదరన్, వెస్ట్రన్, ఒడిశా ప్రాజెక్ట్స్, కార్పొరేట్ కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది..
జీతం..
ఈ ఉద్యోగాల్లో చేరిన తరువాత నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు జీతంగా చెల్లిస్తారు..
2024 జనవరి 16 నుంచి ఫిబ్రవరి 18, 2024 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. ఇకపోతే రూ.500. చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.. ఇక ఈ ఉద్యోగాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే..పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.powergrid.in/ పరిశీలించగలరు…
తాజావార్తలు
-
Mahanadu : ‘స్త్రీ శక్తి’ థీమ్తో టీడీపీ మహానాడు.. 20 కీలక తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం.!
-
PM Modi: పొదుపు వేళ మోడీకి సినీ వర్కర్స్ అసోసియేషన్ లేఖ.. ఏముందంటే..!
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!