ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చెయ్యాలనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ఈఎస్ఐసీ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఈఎస్ఐసీ రీజినల్ కార్యాలయాలు/ ఆసుపత్రుల్లో కింది పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం 1,038 ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు..తెలంగాణ రీజియన్లో 70 ఖాళీలు భర్తీ కానున్నాయి. అర్హత ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 1 నుంచి 30వ తేదీ మధ్యలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మొత్తం ఉన్న ఖాళీల వివరాలు..
ఈసీజీ టెక్నీషియన్, జూనియర్ రేడియోగ్రాఫర్, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్, మెడికల్ రికార్డ్ అసిస్టెంట్, ఓటీ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, సోషల్ గైడ్/ సోషల్ వర్కర్ తదితరాలు ఉన్నాయి.. ఈఎస్ఐసీ రీజియన్ల వారీగా ఖాళీల్లో.. తెలంగాణలో 70 పోస్టులు ఉన్నాయి.ఏ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ..
బిహార్- 64,
చండీగఢ్, పంజాబ్- 32,
ఛత్తీస్గఢ్- 23,
ఢిల్లీ ఎన్సీఆర్- 275,
గుజరాత్- 72,
హిమాచల్ ప్రదేశ్- 06,
జమ్ము అండ్ కశ్మీర్- 09,
ఝార్ఖండ్- 17,
కర్ణాటక- 57,
కేరళ- 12,
మధ్యప్రదేశ్- 13,
మహారాష్ట్ర- 71,
నార్త్ ఈస్ట్- 13,
ఒడిశా- 28,
రాజస్థాన్- 125,
తమిళనాడు- 56,
ఉత్తర్ ప్రదేశ్- 44,
ఉత్తరాఖండ్- 09,
పశ్చిమ్ బెంగాల్- 42..
విద్యార్హతలు..
పదో తరగతి, సంబంధిత విభాగంలో 10+2, డిప్లొమా, సర్టిఫికేట్, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రాత పరీక్ష, టైపింగ్/ డేటా ఎంట్రీ టెస్ట్ , డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు..
జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈఎస్ఎం/ మహిళిలకు రూ.250గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు…
ఎంపిక ప్రక్రియ..
టెక్నికల్/ ప్రొఫెషనల్ నాలెడ్జ్ (50 ప్రశ్నలు- 100 మార్కులు), జనరల్ అవేర్నెస్(10 ప్రశ్నలు- 10 మార్కులు), జనరల్ఇంటెలిజెన్స్(20 ప్రశ్నలు- 20 మార్కులు), అరిథ్మెటిక్ ఎబిలిటీ (20 ప్రశ్నలు- 20 మార్కులు)అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయించారు..2 గంటలు పరీక్ష సమయం..
అక్టోబర్ 01 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల 30 గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.. మరింత సమాచారం కోసం వెబ్ సైట్ https://esic.gov.in/recruitments సందర్శించవచ్చు..