ప్రభుత్వం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. విశాఖపట్నంలోనిసాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.. ఉద్యోగాలు, అర్హతలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
పోస్టుల వివరాలు
మొత్తం ఖాళీల సంఖ్య: 57
ట్రైనీ ఇంజినీర్: 45 పోస్టులు
ప్రాజెక్ట్ ఇంజినీర్: 12 పోస్టులు..
అర్హతలు..
55 శాతం పాస్ మార్కులను పొందిన బీఎస్సీ(ఇంజినీరింగ్)/ బీఈ, బీటెక్(కంప్యూటర్ సైన్స్,ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సీఎస్ఈ/ ఐఎస్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ మెకానికల్/ ఇన్ఫర్మేషన్ సైన్స్ తోపాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.. అప్పుడు సెలెక్ట్ అవుతారు..
వయోపరిమితి..
01.02.2023 నాటికి ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు 28 ఏళ్లు,ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలకు 32 ఏళ్లు మించకూడదు.
జీతం..
నెలకు ట్రైనీ ఇంజినీర్ ఖాళీలకు రూ.30,000-రూ.40,000 వరకు ఉంటుంది.. అలాగే ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలకు రూ.40,000-రూ.55,000 వరకు అందిస్తారు.
ఎంపిక ప్రక్రియ..
రాత పరీక్,ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు..
ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు రూ.177,ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు రూ.472. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు…
ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవాళ్లు ఈ నెల 27 లోపు ఆన్ లైన్ లో అప్లై చేసుకోగలరు.. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ ను పరిశీలించగలరు..