ఏపీ నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇటీవల గ్రూప్స్ కు సంబందించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పుడు తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో(ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది… ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకొనే అభ్యర్థులు అర్హత, జీతం, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకోవడం ముఖ్యం. దాని గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.. ముందుగా తెలుసుకోవడం మంచిది..
మొత్తం పోస్టులు.. 99
సివిల్ ఇంజినీరింగ్- 15
కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్- 12
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్- 10
కంప్యూటర్ ఇంజినీరింగ్- 08
ఆటో మొబైల్ ఇంజినీరింగ్ – 08
కెమిస్ట్రీ- 08
మెకానికల్ ఇంజినీరింగ్- 06
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్- 04
మ్యాథమెటిక్స్- 04
ఇంగ్లిష్ – 04
మైనింగ్ ఇంజినీరింగ్- 04
ఫిజిక్స్- 04
టెక్స్టైల్ టెక్నాలజీ- 03
బయో-మెడికల్ ఇంజినీరింగ్- 02
ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్- 01
సిరామిక్ టెక్నాలజీ- 01
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్- 01
గార్మెంట్ టెక్నాలజీ- 01
జియాలజీ- 01
మెటలర్జికల్ ఇంజినీరింగ్- 01
ఫార్మసీ- 03
అర్హతలు..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు ఫస్ట్ క్లాస్ లో బీఈ, బీటెక్, బీఫార్మసీ, పీజీ పాసై ఉండాలి. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లిష్ టైప్రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి..
వయసు ..
01.07.2023 నాటికి 18 – 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం..
నెలకు రూ.56,100- రూ.98,400.
ఎంపిక ప్రక్రియ..
కంప్యూటర్ ఆధారిత పరీక్ష మెరిట్, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ దరఖాస్తు తేదీ: 29/01/2024 నుంచి 18/02/2024 వరకు.
రాత పరీక్ష తేదీ: ఏప్రిల్/ మే, 2024…
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోగలరు..