Medak Crime: వీడు అసలు మనిషేనా..? పండు ముసలిపై అఘాయిత్యం.. ఆపై గొంతు నులిమి హత్య..
- మెదక్ జిల్లాలో దారుణం..
- టేక్మాల్ మండలం సాలోజి పల్లి గ్రామంలో వృద్ధురాలిపై అత్యాచారం ఆపై హత్య..
- ఆ తర్వాత వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్లు ఎత్తుకెళ్లిన దుర్మార్గుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak Crime: కామంతో కళ్లుచూసుకుపోయిన కామాంధులు.. చిన్నా చితక.. ముసలి ముతక అనే తేడా లేకుండా.. త వాంఛను తీర్చుకుంటున్నారు.. అంతేకాదు.. వారి ప్రాణాలను కూడా తీస్తున్నారు.. తాజాగా మెదక్ జిల్లాలో జరిగిన ఓ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.. మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సాలోజి పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శ్రీ దత్తాశ్రమంలో ఒంటరిగా నివాసముంటున్న వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్ల పై కన్నేసిన ఓ దుర్మార్గుడు.. ఆ గుండ్లను కాజేసేందుకు పన్నాగం పన్నాడు. మద్యం మత్తులో అర్ధరాత్రి సమయంలో ఆశ్రమంలోకి చొరబడి వృద్ధురాలు అంజమ్మ (75) పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత వృద్ధురాలి గొంతు నులిమి మట్టు బెట్టాడు.. అనంతరం వృద్ధురాలి మెడలో ఉన్న బంగారు గుండ్లను అపహరించి ఉడాయించాడు. అయితే, శివకుమార్ (28) అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు తేల్చారు.
Read Also: Waqf board Bill: వక్ఫ్ బోర్డు మాఫియా వశమైంది.. ప్రతిపక్షాలపై కేంద్రం ఆగ్రహం..
Also Read
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
- HYD LOVE MURDER: పథకం ప్రకారమే యువన్ హత్య.. యువన్-యువతి ఆఖరి ఫోన్ కాల్ వైరల్!
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
టేక్మాల్ మండలం సాలోజిపల్లి గ్రామానికి చెందిన దుర్గయ్య, అంజమ్మ దంపతులకు నలుగురు సంతానం.. ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు. వీరిలో ఇద్దరు కుమారులు మృతి చెందారు. పెద్ద కూతురు సాలోజిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహాన్ని జరిపించారు. అనంతరం దుర్గయ్య అంజమ్మ దంపతులు వారి శేష జీవితాన్ని ప్రశాంతంగా దైవ చింతనలో గడిపేందుకు గత 20 ఏళ్ల క్రితం సాలోజిపల్లి గ్రామా శివారులో శ్రీ దత్తాశ్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడే వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో దుర్గయ్య గత కొద్ది సంవత్సరాల క్రితం కన్నుమూశాడు.. అయితే, దుర్గయ్య మృతి అనంతరం అంజమ్మ శ్రీ దత్తాశ్రమంలోనే ఒంటరిగా ఉంటూ తన శేష జీవితాన్ని గడుపుతుంది. ఈ నేపథ్యంలోనే అంజమ్మ కూతురు అల్లుడు ఆశ్రమానికి అప్పుడప్పుడు వచ్చి అంజమ్మ యోగక్షేమలపై ఆరా తీసేవారు. తమ వద్దే ఉండాలని కూతురు అల్లుడు ప్రాధేయపడిన అంజమ్మ నిరాకరించేదని అన్నారు. ఈ క్రమంలోనే నిన్న అర్థరాత్రి అంజమ్మ అల్లుడు తన విధులు ముగించుకొని ఆశ్రమంలో ఒంటరిగా ఉంటున్న తన అత్తగారిని రోజువారీగా భోజనం ఇచ్చి పలకరించేందుకు వెళ్లిన సమయంలో అంజమ్మ స్పృహ కోల్పోయి మిగతాజీవిగా పడి ఉండడాన్ని గమనిచాడు. చీకట్లో శివకుమార్ కూడా ఉండడంతో అనుమానంతో నిలదీసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో శివకుమార్ అంజమ్మ అల్లుడుపై కర్రతో దాడి చేసి పారిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దారుణ ఘటనతో అంజమ్మ కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.
తాజావార్తలు
-
Rajat Patidar: దెబ్బ గట్టిగా తాకింది, ఇప్పుడు బాగానే ఉన్నా.. ఇక వదలను!
-
India Bans Sugar Exports: చక్కెర ఎగుమతులపై భారత్ నిషేధం.. ఎందుకు? పూర్తి వివరాలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
-
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!