Nandyal Crime: యాగంటి క్షేత్రంలో విషాదం.. పందెం ముసుగులో ప్రాణాలు తీసిన స్నేహితులు..!
- యాగంటి క్షేత్రంలో విషాదకర ఘటన..
- విహారయాత్రకు వెళ్లిన 9 మంది స్నేహితులు..
- పందెం వేసుకొని యాగంటి కోనేరులో మునిగిన యువకులు..
- ఒకరు మృతి.. కుటుంబ సభ్యుల అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandyal Crime: విహారయాత్రకు వచ్చిన ఓ మిత్ర బృందంలోని మిత్రుల మధ్య వేసుకున్న పందెంలో ఓ యువకుడు విగత జీవిగా అనుమానాస్పద రీతిలో ప్రాణం కోల్పోయిన ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం పాత కొత్త చెరువు గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు సురేంద్ర (26) అనే యువకుడు, మరో 9 మందితో స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లారు.. స్నేహితులు అందరూ స్వామి అమ్మవార్ల దర్శనం తర్వాత పెద్ద కోనేరులో ఈత కొడుతూ, నీటి లోపల ఎవరు ఎక్కువ సేపు ఉంటే వారు విజేత అని పందెం వేసుకున్నారు.
Read Also: CM Chandrababu Naidu: పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు.. సీఎం సమీక్ష..
Also Read
- POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- Mule Account Scam : బ్యాంక్ అకౌంట్ అమ్ముకుంటే లైఫ్ క్లోజ్.. పోలీసుల సీరియస్ వార్నింగ్..!
- Honour killing: హిందూ యువకుడితో ప్రేమ.. కుమార్తెను ముక్కలుగా నరికి చంపిన తండ్రి..
అయితే, మిత్రులందరికీ మధ్య వేసున్న పందెంలో నీటిలో మునిగిన యువకుడు సురేంద్ర కోనేరు అడుగు భాగంలో ఊపి రాడక పోవటంతో ప్రాణం కోల్పోయి విగత జీవిగా మారాడు, ఇక, సురేంద్ర మృత దేహాన్ని కోనేరు నుండి వెలికి తీసి బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సురేంద్ర యాగంటిలో మృతి చెందాడనే సమాచారం తల్లిదండ్రులకు తెలియడంతో హుటాహుటిన బనగానపల్లెకు వైద్యశాలకు చేరుకున్నారు.. అయితే, మృతుడి తండ్రి నాగరాజు తన కుమారుడి ఎదుగుదలను ఓర్వలేకనే, కక్షపూరిత కుట్రతోనే మిత్రులందరు కలిసి చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. సురేంద్ర యాగంటి పెద్ద కోనేరు నీటిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనకు సంబంధించి, విహార యాత్రకు వచ్చిన మిత్ర బృందంలో ఐదు మంది యువకులు రాత్రికి రాత్రి పరారై పోవటం తల్లిదండ్రులు చేసిన ఆరోపణలకు బలం చేకూర్చినట్టు అవుతుందంటున్నారు.. మరో నలుగురు యువకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు..
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!