Nandyal Crime: యాగంటి క్షేత్రంలో విషాదం.. పందెం ముసుగులో ప్రాణాలు తీసిన స్నేహితులు..!
- యాగంటి క్షేత్రంలో విషాదకర ఘటన..
- విహారయాత్రకు వెళ్లిన 9 మంది స్నేహితులు..
- పందెం వేసుకొని యాగంటి కోనేరులో మునిగిన యువకులు..
- ఒకరు మృతి.. కుటుంబ సభ్యుల అనుమానాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandyal Crime: విహారయాత్రకు వచ్చిన ఓ మిత్ర బృందంలోని మిత్రుల మధ్య వేసుకున్న పందెంలో ఓ యువకుడు విగత జీవిగా అనుమానాస్పద రీతిలో ప్రాణం కోల్పోయిన ఘటన నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా గుంతకల్ మండలం పాత కొత్త చెరువు గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు సురేంద్ర (26) అనే యువకుడు, మరో 9 మందితో స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లారు.. స్నేహితులు అందరూ స్వామి అమ్మవార్ల దర్శనం తర్వాత పెద్ద కోనేరులో ఈత కొడుతూ, నీటి లోపల ఎవరు ఎక్కువ సేపు ఉంటే వారు విజేత అని పందెం వేసుకున్నారు.
Read Also: CM Chandrababu Naidu: పౌరసరఫరాల శాఖ ద్వారా ధాన్యం కొనుగోలు.. సీఎం సమీక్ష..
Also Read
- Kelly Hottle: సినీ పరిశ్రమలో విషాదం.. గాడ్జిల్లా vs కాంగ్ ఫేమ్ నటి 18 ఏళ్లకే మృతి..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
అయితే, మిత్రులందరికీ మధ్య వేసున్న పందెంలో నీటిలో మునిగిన యువకుడు సురేంద్ర కోనేరు అడుగు భాగంలో ఊపి రాడక పోవటంతో ప్రాణం కోల్పోయి విగత జీవిగా మారాడు, ఇక, సురేంద్ర మృత దేహాన్ని కోనేరు నుండి వెలికి తీసి బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సురేంద్ర యాగంటిలో మృతి చెందాడనే సమాచారం తల్లిదండ్రులకు తెలియడంతో హుటాహుటిన బనగానపల్లెకు వైద్యశాలకు చేరుకున్నారు.. అయితే, మృతుడి తండ్రి నాగరాజు తన కుమారుడి ఎదుగుదలను ఓర్వలేకనే, కక్షపూరిత కుట్రతోనే మిత్రులందరు కలిసి చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.. సురేంద్ర యాగంటి పెద్ద కోనేరు నీటిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనకు సంబంధించి, విహార యాత్రకు వచ్చిన మిత్ర బృందంలో ఐదు మంది యువకులు రాత్రికి రాత్రి పరారై పోవటం తల్లిదండ్రులు చేసిన ఆరోపణలకు బలం చేకూర్చినట్టు అవుతుందంటున్నారు.. మరో నలుగురు యువకులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు..
తాజావార్తలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!