AP Crime: దట్టమైన పొదల్లో తల్లి ఆత్మహత్య.. 2 రోజులు మృతదేహంతోనే నరకం చూసిన చిన్నారి..!
- దట్టమైన పొదల్లో తల్లి ఆత్మహత్య..
- తన రెండేళ్ల కూతురుని భుజాన కట్టుకుని ఉరివేసుకున్న మహిళ..
- రెండు రోజుల పాటు నరకం చూసిన చిన్నారి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: దట్టమైన పొదల్లో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.. తన రెండేళ్ల కూతురుని భుజాన కట్టుకుని ఉరివేసుకుంది.. అమ్మ ఒడిలో సేదతీరుతూ హాయిగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారి.. ఏకంగా రెండు రోజుల పాటు నరకం చూసింది.. దట్టమైన పొదల్లో.. తల్లి మృతదేహం వెనుకే వేలాడింది.. ఆకలి తట్టుకోలేక ఆ చిన్నారి ఎంత అలమటించిపోయిందో.. ఎవరూ కనిపించక.. రెండు రోజుల పాటు ఎంత భయంతో వణికిపోయిందో.. చివరకు తల్లి జోలె నుంచి కిందకు జారి.. పొదల నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు విషయం బయటకు పొక్కింది.
Read Also: BRS-Congress Flexi War: సిద్దిపేటలో టెన్షన్ టెన్షన్.. హరీష్ రావు ట్వీట్ వైరల్..
Also Read
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతగిరి మండలం కోనాపురం పంచాయతీ బొండ్యగూడ గ్రామానికి చెందిన పాంగి పద్మ (25).. అరకులోయ మండలం పద్మాపురానికి చెందిన కొండాను వివాహమాడింది. వారికి ఇద్దరు పిల్లలు.. వారిలో రెండేళ్ల చిన్న కుమార్తెను వెంటపెట్టుకొని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా.. పానిరంగనీలో నివసిస్తున్న పెదనాన్న కుమార్తె ఇంటికి వెళ్లింది పద్మ.. బుధవారం తన సోదరి ఇంటికి వెళ్లిన ఆమ.. అందరితో కలిసి భోజనం చేసింది. ఇక, ఇంట్లోవాళ్లు పనికి వెళ్లి తిరిగి వచ్చేసరికి పద్మ కనిపించలేదు. దీంతో.. వారు పద్మ తన ఇంటికి వెళ్లిపోయిందేమోనని భావించారు. అయితే, రెండు రోజుల తర్వాత చివరకు శుక్రవారం రోజు ఉదయం రెండేళ్ల చిన్నారి పానిరంగిని గ్రామ సమీపంలో ఏడ్చుకుంటూ రావడంతో వారు చుట్టుపక్కల వెతికారు. హైవే పక్కన సమీపంలో పొదల్లో చెట్టుకు వేలాడుతూ పద్మ మృతదేహం కనిపించింది. పాపని తన జోలెలో చుట్టుకుని పద్మ ఉరివేసుకొని మృతి చెందినట్టు.. ఆ పరిస్థితులను గమనించినవారు చెబుతున్నారు.. రెండు రోజులపాటు చిన్నారి ఎంత బాధకు గురైందో ఎంతలా ఏడ్చిందో . చివరకు ఎలాగోలా జోలి నుంచి విడిపడి చిన్నారి రోడ్డుపైకి చేరుకుంది. ఈ హృదయ విదారక సంఘటనను తలుచుకుంటేనో అందరి హృదయాలను కలచివేస్తోంది.. చిన్నారి పుష్పను దోమలు, పురుగులు కుట్టడంతో అనారోగ్యానికి గురైంది. పోలీసులు అనుమానస్పద మృతిగా చేసి నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకున్నారు.. క్లూస్ టీమ్ను రప్పించి వివరాలు సేకరించే పనిలో పడిపోయారు..
తాజావార్తలు
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!